బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌(Bigg Boss Season 7) ఇప్పుడు గాడిలో పడింది. ఆసక్తికరంగా మారుతోంది. ఈ రియాటిటీ షో నుంచి ఇప్పటి వరకు అయిదు వారాలు పూర్తి అయ్యాయి. వరుసగా లేడి కంటెస్టెంట్స్‌ హౌస్‌ నుంచి వెళ్లిపోతున్నారు. అయిదో వారంలో డబుల్‌ ఎలిమినేషన్‌ ఉంటుందని అనుకున్నప్పటికీ లాస్ట్‌ మినిట్‌లో శుభ శ్రీ(Subhashree) రాయగురు మాత్రమే బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి బయటకు వెళ్లారు.

బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌(Bigg Boss Season 7) ఇప్పుడు గాడిలో పడింది. ఆసక్తికరంగా మారుతోంది. ఈ రియాటిటీ షో నుంచి ఇప్పటి వరకు అయిదు వారాలు పూర్తి అయ్యాయి. వరుసగా లేడి కంటెస్టెంట్స్‌ హౌస్‌ నుంచి వెళ్లిపోతున్నారు. అయిదో వారంలో డబుల్‌ ఎలిమినేషన్‌ ఉంటుందని అనుకున్నప్పటికీ లాస్ట్‌ మినిట్‌లో శుభ శ్రీ(Subhashree) రాయగురు మాత్రమే బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి బయటకు వెళ్లారు. మరో కంటెస్టెంట్‌ గౌతమ్‌ను(Gautham) మాత్రం సీక్రెట్ రూమ్‌లోకి పంపించారు బిగ్‌ బాస్‌. అయితే ఇప్పటికీ అయిదుగురు కంటెస్టెంట్స్‌ హౌస్‌ నుంచి బయటకు వెళ్లారు. కొత్తగా మరో అయిదుగురు వైల్డ్‌ కార్డ్‌ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. అంబటి అర్జున్‌, పూజా మూర్తి, అశ్విని శ్రీ, నయని పావని, భోలే షావలి కొత్తగా వచ్చారు. అయిదో వారంలో ఎలిమినేట్ అయిన శుభశ్రీ రాయగురు బిగ్‌బాస్‌లో పార్టిసిపేట్‌ చేసినందుకు ఎంత రెమ్యునరేషన్‌(Remuneration) అందుకున్నారన్న దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. హౌస్‌లో అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న శుభశ్రీ హౌస్‌ నుంచి బయటకు వచ్చారు. అయిదో వారం ఎలిమినేషన్‌ ప్రక్రియలో భాగంగా శుభశ్రీకి తక్కువ ఓట్లు రావడంతో ఎలిమినేట్‌ అవ్వాల్సి వచ్చింది. అయితే పారితోషికం విషయానికి వస్తే వారానికి రెండు లక్షల రూపాయల చొప్పున అయిదు వారాలకు పది లక్షల రూపాయలను సంపాదించారని ప్రేక్షకులు అనుకుంటున్నారు.

Updated On 9 Oct 2023 12:19 AM GMT
Ehatv

Ehatv

Next Story