'శ్రీకారం' సినిమా దర్శకుడు కిశోర్‌ రెడ్డి ఏడడుగులు వేశారు. తెలుగు యాంకర్ కృష్ణ చైతన్యను

'శ్రీకారం' సినిమా దర్శకుడు కిశోర్‌ రెడ్డి ఏడడుగులు వేశారు. తెలుగు యాంకర్ కృష్ణ చైతన్యను పెళ్లి చేసుకున్నారు. మార్చి 1న తెల్లవారుజామున మూడు గంటల సమయంలో హైదరాబాద్ మామిడిపల్లి శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో యాంకర్ కృష్ణ చైతన్యను కిశోర్‌ రెడ్డి వివాహం చేసుకున్నారు. శర్వానంద్ హీరోగా 'శ్రీకారం' అనే సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు కిశోర్‌. ఒక మంచి సినిమాగా శ్రీకారం సినిమా నిలిచింది. తెలుగులో 'లవ్‌.కామ్, లక్ష్మీరావే మా ఇంటికి' వంటి చిత్రాలతో పాటు కన్నడంలో ఓ సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేశారు.

యాంకర్ కేసీగా.. కృష్ణ చైతన్య కొల్ల గతంలో ఆర్జేగా పనిచేసింది. ఆర్జే స్మైలీ క్వీన్ పేరుతో ఆమె రేడియో జాకీగా వ్యవహరించేవారు. పలు యూట్యూబ్‌ ఇంటర్వ్యూలతో పాటు సినిమా కార్యక్రమాలకు కూడా ఆమె యాంకర్‌గా వ్యవహరిస్తుంది. కిశోర్‌- కృష్ణ చైతన్యల వివాహానికి సినీ పరిశ్రమ నుంచే కాకుండా మీడియా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

Updated On 29 Feb 2024 9:41 PM GMT
Yagnik

Yagnik

Next Story