తమిళ హీరో ధనుష్‌(Dhanush) తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే! ఆయన నటించిన సినిమాలు తెలుగువారిని కూడా అమితంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఆయన కెప్టెన్‌ మిల్లర్‌(Captain Miller) అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఇప్పుడు ధనుష్‌ తన తర్వాతి చిత్రానికి రెడీ అవుతున్నారు. ఇది ఆయనకు 50వ సినిమా కావడం విశేషం. ఈ సినిమాకు ఆయనే దర్శకత్వం వహిస్తున్నారు. చాలా కాలం కిందటే పా.పాండి(Pa.Pandi) అనే సినిమాతో ధనుష్‌ దర్శకుడయ్యారు.

తమిళ హీరో ధనుష్‌(Dhanush) తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే! ఆయన నటించిన సినిమాలు తెలుగువారిని కూడా అమితంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఆయన కెప్టెన్‌ మిల్లర్‌(Captain Miller) అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఇప్పుడు ధనుష్‌ తన తర్వాతి చిత్రానికి రెడీ అవుతున్నారు. ఇది ఆయనకు 50వ సినిమా కావడం విశేషం. ఈ సినిమాకు ఆయనే దర్శకత్వం వహిస్తున్నారు. చాలా కాలం కిందటే పా.పాండి(Pa.Pandi) అనే సినిమాతో ధనుష్‌ దర్శకుడయ్యారు.

ఆ సినిమా ఘన విజయం సాధించింది. ఇంతకాలం తర్వాత ఆయన మళ్లీ మెగాఫోన్‌ను పట్టుకోబోతన్నారు. కమర్షియల్‌ అంశాలతో కూడిన కుటుంబ కథా చిత్రమని యూనిట్ చెబుతోంది. అన్నదమ్ముల అనుబంధాలను చాటిచెప్పే ఈ సినిమాలో అగ్రశ్రేణి నటులు నటిస్తున్నారు. ఇప్పటికే త్రిషను(Trisha) కథానాయకిగా ఎంపిక చేసుకున్నారు. నిజానికి ఇందులో ధనుష్‌కు జోడిగా కంగనా రనౌత్‌ను తీసుకోవాలని చిత్ర యూనిట్‌ అనుకుంది. ఆ మేరకు ఆమెను అప్రోచ్‌ అయ్యింది.

అయితే ఆమె మాత్రం కాల్‌షీట్స్‌ సమస్య అంటూ సినిమాను చేయనని చెప్పేశారు. ఇక ఈ సినిమాలో దుషారా విజయన్‌(Dhushara Vijayan), సుధీప్‌ కిషన్‌(sudheep Kishan), విష్ణువిశాల్‌(Vishnu Vishal), కాళిదాస్‌(Kalidas) జయరాం(Jayaram) కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా అందిన వార్త ఏమిటంటే ఇందులో సూరారైపోట్రు హీరోయిన్‌ అపర్ణ బాలమురళి(Aparna Bala Murali) కూడా నటిస్తున్నారు. ఇందులో ఈమె సుదీప్‌కిషన్‌కు జంటగా నటించబోతున్నట్టు సమాచారం.

సన్‌ పిక్చర్స్‌(Sun Pictures) సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అస్కార్‌ విజేత ఎ.ఆర్‌. రెహమాన్‌(A.R Rehman) సంగీతాన్ని అందిస్తున్నారు. జులై 1వ తేదీన ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం అవుతుంది. ఈ చిత్రం కోసం చైన్నె, వీసీఆర్‌ రోడ్డులో 500 ఇళ్లతో కూడిన భారీ సెట్‌ రెడీ అవుతోంది. ఇంకో ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ ఏమిటంటే, దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ ప్రేక్షకులను మెప్పించిన ఎస్‌.జె.సూర్య ఇందులో కీలక పాత్ర పోషించనుండటం. కొద్ది రోజులు చిత్రీకరణ చేసుకున్న ఈ సినిమా చిత్రీకరణ చాన్నాళ్లు ఆగిపోయింది.

Updated On 14 Jun 2023 3:25 AM GMT
Ehatv

Ehatv

Next Story