బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీపై కొంతకాలం వార్తలు చక్కర్లు కొట్టాయి. జాన్వీ కపూర్ ఎవరి సరసన నటిస్తుంది అనే విషయంపై ఊహాగానాలు బాగానే వినిపించాయి.

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీపై కొంతకాలం వార్తలు చక్కర్లు కొట్టాయి. జాన్వీ కపూర్ ఎవరి సరసన నటిస్తుంది అనే విషయంపై ఊహాగానాలు బాగానే వినిపించాయి. అయితే రీసెంట్ జాన్వీ కపూర్ బర్త్ డే రోజు వాటన్నింటికీ చెక్ పెట్టేసి ఎన్టీఆర్30 లో హీరోయిన్‏గా చేస్తున్నట్టు అఫిషియల్‏గా ప్రకటించేసేశారు. ఇదిలా ఉంటే ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్లకు స్కోప్ ఉందని, ఈ చిత్రం మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‏టైనర్‏గా తెరకెక్కబోతుందని టాక్స్ నడుస్తున్నాయి.

మరోవైపు ఈ బ్యూటీ తన ప్యాన్ ఇండియా సినిమా కోసం 5 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం బాలీవుడ్ భామలు భారీ రెమ్యునరేషన్‏తో ప్రాజెక్టులను దక్కించుకుంటున్నారు. సాధారణంగా టాలీవుడ్‏లో ఒక సినిమాకు తెలుగు టాప్ హీరోయిన్లు 1 నుంచి 3 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారు. అయితే బాలీవుడ్ భామలు మాత్రం టాలీవుడ్‏లో ఓ సినిమా చేసేందుకు 3 నుంచి 5 కోట్ల డిమాండ్ చేస్తున్నారట.

ఇక శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇండియన్2 చిత్రంలో నటించేందుకు కియారా అద్వానీ 4 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుందట. ఇక ఇప్పటికే రిలీజైన జాన్వీకపూర్ పోస్టర్‍కు మంచి రెస్పాన్స్ ఒస్తోంది. ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‏పై మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు.

ఈ మూవీకి మ్యూజిక్ అనిరుధ్ రవిచందర్ అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, ఎడిటర్‏గా శ్రీకర్ ప్రసాద్ ఉన్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. సినిమాను తెలుగుతోపాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో భాషల్లో విడుదల చేయబోతోన్నారు.

Updated On 8 March 2023 2:25 AM GMT
Ehatv

Ehatv

Next Story