బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌(Bigg Boss 7) ఆసక్తికరంగా సాగుతోంది. ప్రేక్షకులను షో కట్టిపడేస్తోంది. బిగ్‌బాస్‌ ఎప్పుడు ఏం చెప్పినా చేయడానికి కంటెస్టెంట్లు రెడీగా ఉన్నారనిపిస్తోంది. బిగ్‌బాస్‌ కూడా తెలివిగా వ్యవహరిస్తున్నారు. కంటెస్టెంట్లు అలర్ట్‌గా ఉన్నప్పుడు కాకుండా తనకు తోచినప్పుడు, తనకు నచ్చినప్పుడు మాత్రమే టాస్కులు ఇస్తున్నాడు బిగ్‌బాస్‌.

బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌(Bigg Boss 7) ఆసక్తికరంగా సాగుతోంది. ప్రేక్షకులను షో కట్టిపడేస్తోంది. బిగ్‌బాస్‌ ఎప్పుడు ఏం చెప్పినా చేయడానికి కంటెస్టెంట్లు రెడీగా ఉన్నారనిపిస్తోంది. బిగ్‌బాస్‌ కూడా తెలివిగా వ్యవహరిస్తున్నారు. కంటెస్టెంట్లు అలర్ట్‌గా ఉన్నప్పుడు కాకుండా తనకు తోచినప్పుడు, తనకు నచ్చినప్పుడు మాత్రమే టాస్కులు ఇస్తున్నాడు బిగ్‌బాస్‌. బిగ్‌బాస్‌ అనౌన్స్‌మెంట్‌ కోసం ఎదురుచూస్తూ పనుల్లో మునిగిపోయారు హౌస్‌మేట్స్‌. ఎలాంటి టాస్క్‌ ఇస్తాడోనని ఆలోచిస్తూ కొందరు ఇంటిపనులు చేస్తున్నారు. మరికొందరు అప్పుడప్పుడు ఏదో ఒక పని చేఇసనట్టుగా బిల్డప్‌ ఇస్తున్నారు. ఇంకొందరు పాటలు పాడుతున్నారు.

డ్యాన్సులు చేస్తున్నారు. ఇలా ఎవరికి నచ్చినట్టు వారు చేస్తున్నారు. నటుడు శివాజీ(shivaji) ఏదైనా కొత్తగా ప్రయత్నిద్దామనుకుని షకీలాకు(Shakila) ఓ చెత్త ఐడియా ఇచ్చాడు. రాత్రిపూట దెయ్యం పట్టినట్టుగా ప్రవర్తించి అందరికీ కంటిమీద కునుకు లేకుండా చేయాలని షకీలతో చెప్పాడు. ఆమె కూడా రాత్రి పూట అందరి నిద్ర పాడుచేయడం మంచిది కాదేమోనని ఆలోచించలేదు. శివాజీ చెప్పినట్టే అర్ధరాత్రి ఆ ఐడియాను ఇంప్లిమెంట్‌ చేసింది. నిద్రలోంచి ఆకస్మాత్తుగా లేచి కళ్లు పెద్దవి చేస్తూ, ఎవరో వస్తున్నారని మాట్లాడుతూ అందరినీ హడలెత్తించింది. శివాజీకి అది డ్రామా అని తెలుసు కాబట్టి షకీల దగ్గరకు వెళ్లి.. ఏం కాలేదమ్మా.. ఎవరూ రాలేదమ్మా అంటూ షకీలాను బుజ్జగిస్తూ నిద్రపుచ్చాడు.

ఇది ప్రాంక్‌ అని తెలియని మిగతా వారు మాత్రం భయపడిపోయారు. టేస్టీ తేజ(Tasty Teja) అయితే షకీలా అలా సడన్‌గా లేచి ఏదోదే మాట్లాడటం చూసి వణికిపోయాడు. షకీలా ప్రవర్తన చూసిన మిగతా కంటెస్టెంట్లు భయంతో రాత్రంతా మెలకువతోనే ఉన్నారు. తెల్లవారుజామున షకీలా అదంతా ప్రాంక్‌ అని దామినితో చెప్పుకొచ్చింది. షాకైన దామిని రాత్రిపూట అలా చేయడం చాలా తప్పు అని ముఖం మీదే చెప్పేసింది. దీంతో ఓ క్షణంపాటు తాను చేసింది తప్పేమోనని ఆలోచనలో పడ్డారు షకీలా.ఈ కారణం చెప్పి నామినేట్‌ చేస్తే ఊరుకునేది లేదని షకీలా అన్నారు. నామినేషన్స్‌ కోసం కారణాలు వెతుక్కునే కంటెస్టెంట్లకు ఈ ప్రాంక్‌ ఇప్పుడు బ్రహ్మాస్త్రంగా దొరకనుంది. శివాజీ మాట విని షకీలా తన కొమ్మను తానే నరుక్కున్నట్లయింది. నిజంగా తనకు ఏదైనా జరిగినా ఇకపై ఎవరూ నమ్మే పరిస్థితి లేకుండా పోయింది.

Updated On 9 Sep 2023 2:17 AM GMT
Ehatv

Ehatv

Next Story