ఈ ఏడాది రెండు సూపర్‌డూపర్‌ హిట్ సినిమాలను అందించిన బాలీవుడ్‌ కింగ్‌ షారుక్‌ ఖాన్‌(Shah Rukh Khan) హ్యాట్రిక్‌ దిశగా అడుగులు వేస్తున్నారు. ఆయన అభిమానులు ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న డంకీ(Dunki) సినిమా ఈ నెల 21వ తేదిన థియేటర్లలో విడుదల కాబోతున్నది. ఇప్పటికే ఆ సినిమా ప్రమోషన్‌(Promotions) కార్యక్రమాలతో చిత్ర యూనిట్‌ బిజీగా ఉంది. ఈ సందర్భంగా షారుక్‌ ఖాన్‌ జమ్ములోని(Jammu) వైష్ణో దేవి(Vaishno Devi) అమ్మవారిని దర్శించుకున్నారు

ఈ ఏడాది రెండు సూపర్‌డూపర్‌ హిట్ సినిమాలను అందించిన బాలీవుడ్‌ కింగ్‌ షారుక్‌ ఖాన్‌(Shah Rukh Khan) హ్యాట్రిక్‌ దిశగా అడుగులు వేస్తున్నారు. ఆయన అభిమానులు ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న డంకీ(Dunki) సినిమా ఈ నెల 21వ తేదిన థియేటర్లలో విడుదల కాబోతున్నది. ఇప్పటికే ఆ సినిమా ప్రమోషన్‌(Promotions) కార్యక్రమాలతో చిత్ర యూనిట్‌ బిజీగా ఉంది. ఈ సందర్భంగా షారుక్‌ ఖాన్‌ జమ్ములోని(Jammu) వైష్ణో దేవి(Vaishno Devi) అమ్మవారిని దర్శించుకున్నారు. తనకు విజయాన్ని ప్రసాదించమని వేడుకున్నారు. మంగళవారం ఉదయం జమ్మూలోని కత్రా(Katra) దగ్గరకు చేరుకున్నారు షారుక్‌ ఖాన్‌. ఏడాది సమయంలో మూడవసారి ఈ పవిత్ర స్థలాన్ని షారుక్‌ సందర్శించడం విశేషం. ఈ ఏడాది షారుక్‌ఖాన్‌ రెండు బ్లాక్‌ బస్టర్‌ సినిమాలను అందించాడు. ఈ ఏడాది ఆరంభంలో పఠాన్‌(Pathan) సినిమా విడుదలయ్యింది. ఈ సినిమా వెయ్యి కోట్ల క్లబ్‌లో అవలీలగా చేరింది. ఆ తర్వాత జవాన్‌(Jawan) సినిమాతో కూడా మరో డూపర్‌ హిట్‌ను అందుకున్నాడు. ఈ రెండు సినిమాల విడుదలకు ముందు కూడా ఆయన వైష్ణో దేవి అమ్మవారిని దర్శించుకున్నారు. 'పఠాన్‌' విడుదలకు ముందు 2022 డిసెంబర్‌ 12న వైష్ణోదేవి గుడికి వెళ్లిన షారుక్‌ అక్కడ పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. జవాన్‌ విడుదలకు ముందు కూడా అక్కడికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇప్పుడు డంకీ విడుదల సమయంలో అక్కడ పూజలు నిర్వహించారు. అలా వైష్ణోదేవి అమ్మవారి సెంటిమెంట్‌ను షారుక్‌ పాటిస్తున్నారు.అమ్మవారి ఆలయం చుట్టూ షారుక్‌ ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు పలువురు వీడియోలు తీశారు. షారుక్‌తో పాటు తన అంగరక్షకులు, మేనేజర్ పూజా దద్లానీ(Pooja Dadlani) ఉన్నారు. తన సినిమాలు విజయం సాధించాలని విడుదలకు ముందే పలు దేవాలయాలను ఆయన సందర్శిస్తారు. జవాన్‌ సినిమా సమయంలో తిరుమల శ్రీవారిని కూడా ఆయన దర్శించుకున్నారు.

Updated On 12 Dec 2023 5:14 AM GMT
Ehatv

Ehatv

Next Story