బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ ఆసుపత్రి పాలయ్యారు

బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ ఆసుపత్రి పాలయ్యారు. డీహైడ్రేషన్ కారణంగా షారుఖ్ ఖాన్ మే 22 బుధవారం అహ్మదాబాద్‌లోని కెడి ఆసుపత్రిలో చేరారు. కేడీ ఆస్పత్రి వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. షారుఖ్‌ డీహైడ్రేషన్‌తో బాధపడ్డారు. మంగళవారం అహ్మదాబాద్‌లో కేకేఆర్, ఎస్‌ఆర్‌హెచ్ జట్ల మధ్య ప్లే ఆఫ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ కోసం షారూక్ రెండు రోజుల క్రితం అహ్మదాబాద్ చేరుకున్నారు. మ్యాచ్ ముగిసిన తర్వాత, SRK జట్టుతో అర్థరాత్రి అహ్మదాబాద్‌లోని ITC నర్మదా హోటల్‌కు చేరుకున్నారు. ఉదయం షారుఖ్ ఖాన్ ఆరోగ్యం క్షీణించడంతో మధ్యాహ్నం 1 గంటలకు KD ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, తగిన విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు కోరారు.

SRK భార్య, డిజైనర్ గౌరీ ఖాన్, వ్యాపారవేత్త జే మెహతా, నటి జుహీ చావ్లా షారుఖ్ ఆరోగ్యం గురించి తెలుసుకోడానికి ఆసుపత్రిని సందర్శించారు. భారతదేశంలోని అనేక ప్రాంతాలతో పాటు అహ్మదాబాద్‌లో అధిక ఉష్ణోగ్రత నమోదైంది. గుజరాత్ రాజధానిలో దాదాపు 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడంతో వాతావరణ శాఖ నగరంలో రెడ్ అలర్ట్ ప్రకటించింది.

Updated On 22 May 2024 9:10 PM GMT
Yagnik

Yagnik

Next Story