ప్రముఖ సినీ నేపథ్య గాయనీ పి.సుశీల(P.Susheela) అస్వస్థతకు(Health) గురయ్యారు.

ప్రముఖ సినీ నేపథ్య గాయనీ పి.సుశీల(P.Susheela) అస్వస్థతకు(Health) గురయ్యారు. ఆమెను చెన్నైలోని(chennai) కావేరీ ఆస్పత్రిలో(Kaveri hospitals) చేర్పించి చికిత్స అందిస్తున్నారు. సుశీలకు 86 ఏళ్లు. ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. తాజాగా సుశీలకు కడుపునొప్పిరావడంతో ఆస్పత్రికి తరలించగా వెంటనే చికిత్స ప్రారంభించారు. ప్రస్తుతానికి ఆమె పరిస్థితి నిలకగడగానే ఉన్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. సుశీల ఆరోగ్యం గురించి ఆందోళన చెందకూడదని ఆమె అభిమానులకు సూచించారు. ఆమె త్వరగా కోల్కోవాలని అభిమానులు, సన్నిహితులు కోరుతున్నారు. సుశీల పద్మభూషణ్‌ అవార్డు గ్రహీత.

Eha Tv

Eha Tv

Next Story