బాలీవుడ్‌ నటుడు, యానిమల్‌ ఫేమ్‌ రణ్‌బీర్‌ కపూర్‌లో వివాదంలో చిక్కుకున్నాడు. ఓ మతాన్ని కించపరిచేలా వ్యవహరించాడని ఘట్‌కోపర్‌ పోలీస్‌స్టేషన్‌లో సంజయ్‌ తివారీ(Sanjay Tiwari) అనే వ్యక్తి తన న్యాయవాదులైన రాయ్‌, మిశ్రా ద్వారా ఫిర్యాదు చేశాడు. హిందువుల మనోభావాలను కించపరిచాడని రణ్‌బీర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరాడు.

బాలీవుడ్‌ నటుడు, యానిమల్‌ ఫేమ్‌ రణ్‌బీర్‌ కపూర్‌లో(Ranbir kapoor) వివాదంలో చిక్కుకున్నాడు. ఓ మతాన్ని కించపరిచేలా వ్యవహరించాడని ఘట్‌కోపర్‌ పోలీస్‌స్టేషన్‌లో సంజయ్‌ తివారీ(Sanjay Tiwari) అనే వ్యక్తి తన న్యాయవాదులైన రాయ్‌, మిశ్రా ద్వారా ఫిర్యాదు చేశాడు. హిందువుల మనోభావాలను కించపరిచాడని రణ్‌బీర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరాడు.

బాలీవుడ్‌ స్టార్ రణ్‌బీర్ తన కుటుబంతో కలిసి క్రిస్మస్‌(Christmas) వేడుకలు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేసే ముందు.. దానిపై ఆల్కహాల్(Alcohol) పోసి నిప్పటించాడు. దీంతో కాసేపు కేక్‌ మీద మంటలు వచ్చాయి. ఈ సందర్భంగా ' జై మాతా ది' అంటూ నినదించారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌కాగా(Social Media Viral) దీనిపై సంజయ్‌ తివారీ అనే వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఓ మతం కోసం నిర్వహించిన పండగలో హిందువుల మనోభావాలను కించపరిచారని ఆరోపించాడు. ఇతర దేవతలను కొలిచే ముందు అగ్నిదేవుడిని హిందువులు ఆరాధిస్తారని.. రణ్‌బీర్‌ కపూర్, అతని కుటుంబసభ్యులు ఉద్దేశపూర్వకంగానే కేక్‌పై మద్యం పోసి నిప్పంటించి 'జై మాతా ది' అని ఎలా అంటారని ప్రశ్నించాడు. రణ్‌బీర్‌పై కేసు నమోదు చేయాలని ఘట్‌కోపర్‌ పోలీస్‌స్టేషన్‌లో తన లాయర్లు రాయ్‌, పంకజ్‌ మిశ్రాతో ఫిర్యాదు చేయించాడు. సంజయ్ తివారీకి పలు హిందూ సంఘాలు కూడా మద్దతు తెలిపాయి

Updated On 28 Dec 2023 2:59 AM GMT
Ehatv

Ehatv

Next Story