తమిళ నాట హీరోలంతా ప్రయోగాలకు పెద్ద పీట వేస్తుంటారు. అందులో మొదటి నుంచి హీరో విశాల్(Vishal) కూడా ఎన్నో ఎక్ప్ పెర్మెట్స్ చేశాడు.. మరీ ముఖ్యంగా మాస్ యాక్షన్ సినిమాలకు ఇంపార్టెన్స్ ఇస్తూ వస్తున్నాడు విశాల్.

తమిళ నాట హీరోలంతా ప్రయోగాలకు పెద్ద పీట వేస్తుంటారు. అందులో మొదటి నుంచి హీరో విశాల్(Vishal) కూడా ఎన్నో ఎక్ప్ పెర్మెట్స్ చేశాడు.. మరీ ముఖ్యంగా మాస్ యాక్షన్ సినిమాలకు ఇంపార్టెన్స్ ఇస్తూ వస్తున్నాడు విశాల్. వాడు వీడు లాంటి సినిమాలలో విశాల్ చేసిన ప్రయోగం అతని ఇమేజ్ ను ఎక్కడికో తీసుకెళ్ళింది. అంతే కాదు.. యాక్షన్ సీన్స్ ను ఏమాత్రం లెక్క చేయకుండా.. డూప్ లేకుండా చేయడంలో చేయడం విశాల్ కే దగ్గింది.

ఇలా యాక్షన్ సీన్స్ చేసేప్పుడు ఎన్నోసార్లు పెద్ద పెద్ద గాయాలు అయినా.. లెక్క చేయకుండా తన మార్క్ చూపించుకుంటాడు స్టార్ హీరో. ఇక తాజాగా అలా ఆయన ద్విపాత్రాభినయం చేసిన 'మార్క్ ఆంటోని'(Mark Antony) సినిమా ఇటీవలే ప్రేక్షకులను పలకరించింది. ఇక తన సినిమా హిట్ అయినా .. ఫ్లాప్ అయినా వెంటనే మరో ప్రాజెక్టుపైకి వెళ్లిపోవడం విశాల్ కి అలవాటు.

ఇక విశాల్ కు సబంధించి 34వ సినిమాకి సంబంధించి రంగంలోకి దిగిపోయాడు. అయితే ఈసినిమాలో ప్రత్యేకత ఏంటంటే.. ఈసినిమాలో ముగ్గరు దర్శకులు(directors) కూడా కనిపించబోతున్నారు. ఈ సినిమాలో సముద్రఖని(samuthirakani), గౌతమ్ వాసుదేవ మీనన్(Gautham Vasudev Menon) ముఖ్యమైన పాత్రలను పోషించనున్నారు. మరో దర్శకుడు కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నాడని అంటున్నారు. ఈ భారీ బడ్జెట్ సినిమాకి హరి దర్శకత్వం వహిస్తున్నాడు.

గతంలో హరి - విశాల్ కాంబినేషన్లో వచ్చిన 'భరణి'(Bharani) .. 'పూజ'(Pooja) సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అందువలన ఈ సినిమాపై అందరిలో ఆసక్తి ఉంది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్ లో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియా భవాని శంకర్(Priya bhavani Shankar) కథానాయికగా కనిపించనుంది. దేవిశ్రీ ప్రసాద్(DSP) ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు.స్టోన్ బెంచ్ - జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Updated On 17 Oct 2023 1:59 AM GMT
Ehatv

Ehatv

Next Story