టాలీవుడ్ స్టార్ సీనియర్ హీరోయిన్.. సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మయోసైటిస్(Mayositis) వ్యాధితో బాధ పడుతున్న ఆమె .. దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం కోసం దాదాపు ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉంటానని రీసెంట్ గా అనౌన్స్ చేసింది. అయితే అలా ప్రకటించి బ్రేక్ తీసుకున్న సమంత.. వెకేషన్స్ కు వెళ్తూ..

సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇచ్చింది టాలీవుడ్ స్టార్ సీనియర్ హీరోయిన్ సమంత(Samantha). బ్రేక్ ఇచ్చింది ట్రీట్మెంట్ కోసం అయితే.. వెకేషన్ ను ఎంజాయ్ చేస్తోంది బ్యూటీ.

టాలీవుడ్ స్టార్ సీనియర్ హీరోయిన్.. సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మయోసైటిస్(Mayositis) వ్యాధితో బాధ పడుతున్న ఆమె .. దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం కోసం దాదాపు ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉంటానని రీసెంట్ గా అనౌన్స్ చేసింది. అయితే అలా ప్రకటించి బ్రేక్ తీసుకున్న సమంత.. వెకేషన్స్ కు వెళ్తూ.. ఎంజాయ్ చేస్తోంది. రీసెంట్ గా తన ఫ్రెండ్స్ టీమ్ ను తీసుకుని బాలి(Bali) పర్యటనకు వెళ్లి ఫుల్ గా ఎంజాయ్ చేసింది సమంత. అక్కడ ఆమె చేసిన అన్ని పనులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

తాజాగా చెన్నై చేరింది బ్యూటీ. తన స్నేహితురాలు, గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద(Chinmai Sripada) ఇంటికి వెళ్లింది. చిన్మయి పిల్లలతో కలిసి ఆటలాడుతూ సందడి చేసింది. పిల్లలతో 'నాటునాటు' పాటకు స్టెప్పులు వేయించింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమంత ఆమధ్య శాకుంతలం సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. గుణశేఖర్‌ తెరకెక్కించిన ఈ పౌరాణిక చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

ఆ తర్వాత తాజాగా రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ సరసన ఖుషి చిత్రంలో నటించింది సమంత. ఈమూవీ నుంచి రిలీజ్ అయిన పాటలు సౌత్ అంతా ఫేమస్అయ్యాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్‌ 1న విడుదల కానుంది. దీంతో పాటు ‘సిటాడెల్‌’ లో కూడా నటించింది. రాజ్‌ అండ్‌ డీకే తెరకెక్కించిన ఈ వెబ్‌ సిరీస్‌లో బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ ధావణ్ తో కలిసి సామ్‌ స్క్రీన్‌ పంచుకుంది. ఈ వెబ్‌ సిరీస్‌ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated On 8 Aug 2023 5:36 AM GMT
Ehatv

Ehatv

Next Story