అగ్ర కథానాయిక సమంత(Samantha) నిజంగానే సినిమాలకు విరామం ఇవ్వనున్నారా? ఏడాది కాలంగా తన ఆరోగ్య సమస్యలపైనే కాకుండా, ఇతర వ్యక్తిగత సమస్యలపై కూడా అలుపెరగకుండా పోరాడుతున్న ధైర్యశాలి సమంత హఠాత్తుగా ఎందుకీ నిర్ణయం తీసుకున్నారు? ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారా? మయోసైటిస్‌ అనే అరుదైన కండరాల వ్యాధికి గురైన సమంత దాదాపు ఆరు నెలల పాటు చికిత్స తీసుకున్నారు. మళ్లీ మామూలు మనిషయ్యారు.

అగ్ర కథానాయిక సమంత(Samantha) నిజంగానే సినిమాలకు విరామం ఇవ్వనున్నారా? ఏడాది కాలంగా తన ఆరోగ్య సమస్యలపైనే కాకుండా, ఇతర వ్యక్తిగత సమస్యలపై కూడా అలుపెరగకుండా పోరాడుతున్న ధైర్యశాలి సమంత హఠాత్తుగా ఎందుకీ నిర్ణయం తీసుకున్నారు? ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారా? మయోసైటిస్‌ అనే అరుదైన కండరాల వ్యాధికి గురైన సమంత దాదాపు ఆరు నెలల పాటు చికిత్స తీసుకున్నారు. మళ్లీ మామూలు మనిషయ్యారు. ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీ అయ్యారు. ప్రస్తుతం ఆమె విజయ్‌ దేవరకొండ సరసన ఖుషీ అనే సినిమాలో నటిస్తున్నారు. దీనితో పాటు సిటాడెల్‌ వెబ్‌ సిరీస్‌లో కూడా సమంత నటిస్తున్నారు. అయితే ఇటీవల ఆమె ఆరోగ్యంపై మళ్లీ వదంతులు మొదలయ్యాయి. మయోసైటిస్‌కు చికిత్స తీసుకునేందుకు సమంత అమెరికా వెళ్లబోతున్నారని, కాబట్టి ఏడాది పాటు సినిమాలకు విరామం తీసుకోనున్నారని వార్తలు వచ్చాయి. ఆమె తాజా ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ ఈ వార్తలకు బలం ఇచ్చేలా ఉంది. షూటింగ్ లొకెషన్‌లో కారవాన్‌లో ఉన్న ఫోటోను పెట్టిన సమంత ' ఈ ఆరు నెలలు చాలా కష్టంగా గడిచాయి. ఇక వీటికి ముగింపు పలకాల్సిన తరుణం ఆసన్నమయ్యింది. మరో మూడు రోజులు మాత్రమే ఈ కారవాన్‌లో ఉండేది' అంటూ రాసుకొచ్చారు సమంత. సమంత పోస్ట్‌తో ఫాన్స్‌లో ఆందోళన మొదలయ్యింది. ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే త్వరగా కోలుకుని షూటింగ్‌లో పాల్గొనాలని కోరుకుంటున్నారు. ఆమె ఆరోగ్యంగా ఉండేలా చూడమని తమ ఇష్ట దైవాలను ప్రార్థిస్తున్నారు.

Updated On 10 July 2023 10:19 PM GMT
Ehatv

Ehatv

Next Story