తెలుగు సినిమా పరిశ్రమలోనూ జస్టిస్‌ హేమా కమిటీ(Hema Justice Committee) తరహాలో ఓ కమిటీ రావాలని అగ్ర కథానాయిక సమంత(Samantha) కోరారు.

తెలుగు సినిమా పరిశ్రమలోనూ జస్టిస్‌ హేమా కమిటీ(Hema Justice Committee) తరహాలో ఓ కమిటీ రావాలని అగ్ర కథానాయిక సమంత(Samantha) కోరారు. తెలుగు ఇండస్ట్రీలో మహిళల కోసం ఏర్పాటు చేసి 2019 సబ్‌ కమిటీ నివేదికను బయటపెట్టాలని కూడా సమంత అన్నారు. ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా ఈ విజ్ఞప్తులు చేశారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్లో(Instagram) మరో పోస్ట్ షేర్‌ చేశారు. అదిప్పుడు వైరల్‌ అవుతోంది. 'ఆగస్టు నెల గడిచిపోయింది. 2012లో జరిగిన హత్యాచార ఘటన తరహాలోనే ఇటీవల కోల్‌కతాలోనూ జరిగింది. ఘటనలు జరుగుతున్నాయి. వీటి గురించి మనందరం మాట్లాడుకుంటున్నాం. ఈ ఘటనల హైప్‌ మెల్లిగా తగ్గిపోతుంది. మనం కూడా మన పనులతో ముందుకెళ్తుంటాం. మళ్లీ ఘటన జరుగుతుంది’ అంటూ సమంత ఆ పోస్ట్‌లో షేర్‌ చేశారు. ఇదిలా ఉంటే.. తాను గాయపడ్డ విషయాన్ని పరోక్షంగా చెప్పారు. 'గాయాలు లేకుండా నేను యాక్షన్‌ స్టార్‌ కాలేనా?' అంటూ సమంత పెట్టిన పోస్టు చూస్తే ఏదో సినిమా సెట్‌లో ఆమె గాయపడి ఉంటారని ఊహించవచ్చు.

Eha Tv

Eha Tv

Next Story