ఈ వ్యాఖ్యలపై సమంత మరోసారి రియాక్టయ్యారు.

సినీ నటి సమంతపై(Samantha) తెలంగాణ మంత్రి కొండా సురేఖ(Konda surekha) అడ్డగోలుగా చేసిన వ్యాఖ్యలు దేశంలోనే దుమారం రేపాయి. సమంతపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని చెప్పిన సురేఖ కొద్ది సేపటికే మళ్లీ అదే రకమైన అసహ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై సమంత మరోసారి రియాక్టయ్యారు. వెబ్‌ సిరీస్‌ ప్రమోషన్‌లో భాగంగా మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా కొండా సురేఖ వివాదం గురించి రిపోర్టర్‌ ఓ ప్రశ్న వేశారు. దానికి సమంత స్పందించిన తీరు అద్భుతం. ఆమె ఎక్కడా సురేఖ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ‘ఈరోజు ఇక్కడ కూర్చోవడానికి ఎంతోమంది మద్దతే కారణం. ఇండస్ట్రీకి చెందిన ఎంతోమంది ప్రేమ, నాపై వారికి ఉన్న నమ్మకమే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది. కష్టాలను ఎదుర్కోవడంలో ఆ మద్దతు నాకెంతో సహాయపడింది. వారు నా పక్షాన లేకపోతే కొన్ని పరిస్థితులను అధిగమించేందుకు చాలా సమయం పట్టేది. నేను వాటిని వదులుకోవాలని కూడా భావించేదాన్నేమో. నా చుట్టూ ఉన్నవారి నమ్మకం వల్లే వాటిని ఎదుర్కోగలిగాను’ అని సమంత చెప్పారు. అలాగే ఆన్‌లైన్‌ ట్రోలింగ్‌పై కూడా సమంత స్పందించారు. అలాంటి వాటి గురించి పెద్దగా ఆలోచించను అని చెప్పారు. ‘ద్వేషపూరిత సందేశాలను స్వీకరించినప్పుడు వాటి ప్రభావం నాపై పడకుండా చూసుకుంటాను. దాన్ని పంపిన వారు కూడా అలాంటి బాధనే అనుభవించారేమో అని అనుకుంటాను' అంటూ సమంత చెప్పారు. దటీజ్‌ సమంత!

Eha Tv

Eha Tv

Next Story