సినిమాలకు ఏడాది పాటు బ్రేక్ ఇచ్చింది సమంత(Samantha). మయోసైటిస్(Mayositis) తో బాధపడుతున్న సమంత... ట్రీట్మెంట్ తీసుకుంటూనే.. బ్రేక్ ను బాగా ఎంజాయ్ చేస్తోంది. అమెరికాలో(America) ట్రీట్మెంట్ తీసుకుంటూ.. ఖాళీ టైమ్ లో విదేశాల్లో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతోంది.

సినిమాలకు ఏడాది పాటు బ్రేక్ ఇచ్చింది సమంత(Samantha). మయోసైటిస్(Mayositis) తో బాధపడుతున్న సమంత... ట్రీట్మెంట్ తీసుకుంటూనే.. బ్రేక్ ను బాగా ఎంజాయ్ చేస్తోంది. అమెరికాలో(America) ట్రీట్మెంట్ తీసుకుంటూ.. ఖాళీ టైమ్ లో విదేశాల్లో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతోంది. తొలుత ఇండొనేషియాలోని(Indonesia) బాలి(Bali) ట్రిప్ కు వెళ్లిన సమంత... ఆ తర్వాత అమెరికాకు వెళ్లింది. యూఎస్ లో మయోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకుంది. వారం క్రితం ఆమె ఆస్ట్రియాకు వెళ్లి ఎజాంయ్ చేస్తోంది.

ఆస్ట్రియాలో ఎంజాయ్ చేస్తూ... ఫొటోలను సోషల్ మీడియాలో(Social Media) షేర్ చేస్తోంది. తాజాగా సెల్ట్ బర్గ్(Selt barg) నగరంలో హ్యాపీగా గడుపుతోంది. ఓ సరస్సు పక్కన సైకిల్ తొక్కుతూ నేచర్ ని ఎంజాయ్ చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.ఖుషి, సిటాడెల్‌ తర్వాత సామ్‌ ఏ సినిమాను ఒప్పుకోలేదు.. సైన్ చేయలేదు. అలాగే కొత్త ప్రాజెక్ట్స్‌కు సైన్‌ కూడా చేయలేదు. కమిట్‌మెంట్స్‌ ఇచ్చిన సినిమాలకు సంబంధించిన అడ్వాన్స్‌లు కూడా తిరిగి ఇచ్చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం తను ట్రావెలింగ్‌పై దృష్టిపెట్టింది. చిన్నప్పట్నుంచీ తను చూడాలనుకున్న ప్రదేశాలన్నింటినీ సరదాగా చుట్టి వచ్చే పనిలోపడింది.

చివరిగా సమంత నుంచి వచ్చిన సినిమా ఖుషి. ఈసినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ జోడీగా నటించింది సమంత రీసెంట్ గా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈసినిమా పర్వాలేదు అనిపించుకుంది. మంచి టాక్‌ అందుకున్నా కలెక్షన్ల పరంగా పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి నిన్ను కోరి, మజిలీ ఫేం శివనిర్వాణ దర్శకత్వం వ‌హించారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యానర్‌ తెరకెక్కించిన ఈ మూవీ తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైంది.

Updated On 1 Oct 2023 6:30 AM GMT
Ehatv

Ehatv

Next Story