పృథ్వీరాజ్, జగపతి బాబుతో కలిసి ప్రభాస్ నటించిన సినిమా సలార్

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'సలార్ 2 శౌర్యంగ పర్వం' సినిమా అప్‌డేట్ ఎట్టకేలకు వచ్చింది. ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ చిత్రం తర్వాత సలార్ సీక్వెల్ వస్తుందని అనుకున్నారు. అయితే సలార్ 2 ని పూర్తీ చేశాకనే ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ సినిమా ఉండబోతోంది. సలార్ 2 గురించి కీలక విషయాన్ని నటుడు బాబీ సింహా బయట పెట్టారు. ఇటీవలి ఇంటర్వ్యూలో, "శౌర్యంగ పర్వం" ఏప్రిల్‌లో సమ్మర్ షూట్‌కు సిద్ధమవుతున్నట్లు ఆయన తెలిపారు. హై-ఆక్టేన్ యాక్షన్ చిత్రాలకు పేరుగాంచిన ప్రశాంత్ నీల్ “శౌర్యంగ పర్వం” స్క్రిప్ట్‌ను ఇప్పటికే పూర్తి చేసినట్లు సమాచారం.

పృథ్వీరాజ్, జగపతి బాబుతో కలిసి ప్రభాస్ నటించిన సినిమా సలార్. ప్రపంచవ్యాప్తంగా 600 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక ఓటీటీలో కూడా ఈ సినిమా సరికొత్త రికార్డులను సృష్టించింది. సలార్ సినిమా చుట్టూ ఉన్న హైప్‌ కారణంగా "శౌర్యంగ పర్వం"కు కూడా భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. ప్రభాస్ హీరోగా ఈ ఏడాది రెండు సినిమాలు రాబోతున్నాయి. ఒకటి 'కల్కి' కాగా.. మరొకటి 'రాజా సాబ్'.

Updated On 4 March 2024 1:10 AM GMT
Yagnik

Yagnik

Next Story