చాలా కాలం తరువాత ఎన్టీఆర్ 30(NTR 30) షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఇలా స్టార్ట్ అవ్వడంతోనే సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటోంది ఎన్టీఆర్ 30 మూవీ. షూటింగ్ ను ఇప్పటివరకూ నాన్ స్టాప్ గా చేస్తున్నారు. తాజాగా ఈమూవీ షూటింగ్ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్(Jr. NTR) హీరోగా.. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) తారక్ జంటగా నటిస్తూ.. సౌత్ ఎంట్రీ ఇస్తున్న సినిమా ఎన్టీఆర్ 30. వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈసినిమా టైటిల్ ఇంకా ఖరారు కాలేదు.

చాలా కాలం తరువాత ఎన్టీఆర్ 30(NTR 30) షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఇలా స్టార్ట్ అవ్వడంతోనే సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటోంది ఎన్టీఆర్ 30 మూవీ. షూటింగ్ ను ఇప్పటివరకూ నాన్ స్టాప్ గా చేస్తున్నారు. తాజాగా ఈమూవీ షూటింగ్ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.

జూనియర్ ఎన్టీఆర్(Jr. NTR) హీరోగా.. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) తారక్ జంటగా నటిస్తూ.. సౌత్ ఎంట్రీ ఇస్తున్న సినిమా ఎన్టీఆర్ 30. వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈసినిమా టైటిల్ ఇంకా ఖరారు కాలేదు. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా రిలీజ్ కాబోతున్నా ఈమూవీలో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan) నటిస్తున్నారు. ప్రస్తుంతం షూటింగ్ లో జాన్వీ కపూర్ తో పాటు.. సైఫ్ కూడా పాల్గొంటున్నారు.

ఈ క్రమంలో నాన్ స్టాప్ గా షూటింగ్ ప్లాన్ చేశారు ఎన్టీఆర్ 30 టీమ్. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో స్పెషల్ సెట్స్ లో భారీ యాక్షన్ సీన్స్ ను షూట్ చేస్తున్నారట టీమ్. విలన్ గా సైఫ్ అలీ ఖాన్-ఎన్టీఆర్ మీద భారీ పోరాట సన్నివేశం చిత్రీకరిస్తున్నారట. ఒక ట్రైన్ సెట్ కూడా ఏర్పాటు చేశారని సమాచారం. అంతే కాదు ఈ యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ కూడా చివరి దశకు వస్తున్నట్టు సమాచారం. రెండు రోజుల్లో యాక్షన్ సీక్వెన్స్ ల చిత్రీకరణ అయిపోతుందంటూ.. సమాచారం. అంతే కాదు ఈ యాక్షన్ సీక్వెన్స్ లు అన్నీ ఫారెన్ యాక్షన్ కొరియోగ్రాఫర్లు చేసినట్టు తెలుస్తోంది.

హాలీవుడ్ స్టాయిలో ఈ యాక్షన్స్ సీక్వెలన్స్ లు తెరకెక్కినట్టు సమాచారం. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈమూవీ వీరి కాంబినేషన్ లో రెండోవది. గతంలో జనతా గ్యారేజ్ చిత్రం చేశారు. ఈ మూవీ మంచి విజయం సాధించింది. చాలా కాలం తర్వాత మరోసారి చేతులు కలిపారు. ఎన్టీఆర్ 30 మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను దాదాపుగా 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరక్కిస్తున్నారు.

అనిరుధ్ సంగీతం సమకూర్చుతున్న ఈసినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో కళ్యాణ్ రామ్ నిర్మాతగా మరియు యువ సుధ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్నాయి. ఇక ఈ మూవీ సాగరతీరం నేపథ్యంలో సాగుతుందని దర్శకుడు కొరటాల చెప్పారు. రాక్షసులను భయపెట్టే వీరుడిగా హీరో పాత్ర ఉంటుందని వెల్లడించారు. హీరోయిన్ జాన్వీ పాత్ర మత్య్సకారుల అమ్మాయిగా.. నటిస్తుందని ఆమె కూడా కథలో చాలా కీలకం అన్నారు. ఇక ఆర్ ఆర్ ఆర్ అనంతరం ఎన్టీఆర్ నుండి వస్తున్న మూవీ కావడంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Updated On 2 May 2023 12:57 AM GMT
Ehatv

Ehatv

Next Story