విలక్షణ నటి సాయి పల్లవి(Sai Pallavi) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దక్షిణాది సినీ పరిశ్రమలో అద్భుతమైన నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒప్పుకునే రకం కాదు. తనకు పాత్ర నచ్చితేనే చేస్తారు. లేకపోతే నిర్మోహమాటంగా నో చెప్పేస్తారు. అందుకే ఆమె చేసిన సినిమాను తక్కువ అయినప్పటికీ అన్ని ఆమెకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. సాయిపల్లవి తెరపైకి కనిపించి చాలా కాలమే అయ్యింది.

విలక్షణ నటి సాయి పల్లవి(Sai Pallavi) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దక్షిణాది సినీ పరిశ్రమలో అద్భుతమైన నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒప్పుకునే రకం కాదు. తనకు పాత్ర నచ్చితేనే చేస్తారు. లేకపోతే నిర్మోహమాటంగా నో చెప్పేస్తారు. అందుకే ఆమె చేసిన సినిమాను తక్కువ అయినప్పటికీ అన్ని ఆమెకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. సాయిపల్లవి తెరపైకి కనిపించి చాలా కాలమే అయ్యింది. మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) నటించిన భోళా శంకర్‌లో(Bhola Shankar) చెల్లెలి పాత్రలో కీర్తి సురేశ్‌(Keerthy suresh) నటించారు కదా! మొదట ఈ పాత్ర కోసం సాయి పల్లవిని ఆప్రోచ్‌ అయ్యారట! ఆమె సున్నితంగా తిరస్కరించారు. సాయి పల్లవి అందులో నటించకపోవడమే మంచిదయ్యిందని అనుకుంటున్నారు ఆమె ఫ్యాన్స్‌. ఎందుకంటే ఆ సినిమా పెద్ద డిజాస్టర్‌ అయ్యింది. ప్రస్తుతం లోక నాయకుడు కమలహాసన్‌(Kamal Hassan) తన సొంత నిర్మాణ సంస్థ రాజ్‌కమల్‌ఫిలిం(Raj Kamal) ఇంటర్నేషనల్‌ పతాకంపై తమిళంలో నిర్మిస్తున్న సినిమాలో శివకార్తీకేయన్‌కు(Shiva Karthikeyan) జంటగా నటిస్తున్నారు సాయి పల్లవి.

ఈ సినిమా షూటింగ్‌ ఇటీవలే కశ్మీర్‌ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం సాయి పల్లవి చేతిలో ఇది తప్ప మరో సినిమా లేదు. తాజాగా ఆమె సీతమ్మ పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. చాన్నాళ్ల కిందట బాపు(Bapu) దర్శకత్వంలో వచ్చిన శ్రీరామరాజ్యంలో నయనతార సీతగా నటించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఈ మధ్య ప్రభాస్‌ రాముడిగా నటించిన ఆదిపురుష్‌ సినిమాలో సీత పాత్రలో కృతి సనన్‌(Kriti sanon) కనిపించారు. ఆ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర చతికిలపడింది. సీతగా కృతి అంతగా మెప్పించలేకపోయారనే విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు రామాయణాన్ని మరోసారి వెండితెరపైకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నితీష్‌ తివారి(Nitish Thiwari) ఈ సినిమాను హిందీలో రూపొందించనున్నారు. ఇందులో రాముడిగా రణ్‌బీర్‌ కపూర్‌ను(Ranbir kapoor) నటిస్తున్నారు. సీతగా ఆలియాభట్‌ను ఎంపిక చేశారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ సినిమా నుంచి ఆమె వైదొలిగారనే వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో ఆ పాత్రలో సాయిపల్లవిని తీసుకోవాలనే నిర్ణయానికి మేకర్స్‌ వచ్చారట! ఇందు కోసం ఆమెను సంప్రదించారట కూడా! ఇదే వాస్తవం అయితే మాత్రం ఈ సినిమా ద్వారా సాయి పల్లవి బాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నారన్నమాట!

Updated On 31 Aug 2023 12:41 AM GMT
Ehatv

Ehatv

Next Story