వరుసగా ఆధ్యాత్మిక యాత్రలు చేస్తున్నాడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్. బ్రో(BRO)మూవీ సక్సెస్ తో పాటు.. తన ఆరోగ్యం గురించి ఆయన ఈ ఆయాత్రలు చేస్తున్నట్టు సమాచారం. సుప్రీమ్ హీరో.. సాయి ధరమ్ తేజ్ హీరోగా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan) ఓ ఇంపార్టెంట్ రోల్ చేసిన సినిమా బ్రో.

ఈమధ్య ఎక్కువగా దైవ దర్శనాలు చేసుకుంటున్నాడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej). ఆమధ్య తిరుపతి(Tirupathi) వెళ్లిన ఆయన.. తాజాగా అరవెల్లిలో(Aravalli) ప్రత్యక్ష్యం అయ్యాడు.

వరుసగా ఆధ్యాత్మిక యాత్రలు చేస్తున్నాడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్. బ్రో(BRO)మూవీ సక్సెస్ తో పాటు.. తన ఆరోగ్యం గురించి ఆయన ఈ ఆయాత్రలు చేస్తున్నట్టు సమాచారం. సుప్రీమ్ హీరో.. సాయి ధరమ్ తేజ్ హీరోగా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan) ఓ ఇంపార్టెంట్ రోల్ చేసిన సినిమా బ్రో. ఈమూవీ ఈనెల 28న రిలీజ్ కు రెడీగా ఉంది. తమిళంలో సూపర్ హిట్ అయిన వినోయద సిత్తం(Vinodhaya Sitham) సినిమాకు రీమేక్ గా ఈ మూవీ తెరకెక్కింది. ఈ సినిమాను తమిళంలో డైరెక్ట్ చేసిన నటుడు, దర్శకుడు సముద్రఖని(Samuthrakhani) తెలుగులో కూడా దర్శకత్వం వహించారు. తాజాగా ఈమూవీ ట్రైలర్ రిలీజ్ అవ్వగా.. మెగా ఫ్యాన్స్ ను ఈ ట్రైలర్ దిల్ ఖుష్ చేస్తోంది.

ఈసినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో.. మూవీ టీమ్ ప్రమోషన్లకు పదును పట్టింది. పోస్ట్ ప్రొడక్షన్ ను సూపర్ ఫాస్ట్ గా చేస్తున్నారు టీమ్. ఇక హీరో సాయి ధరమ్ తేజ్ మాత్రం ఈమూవీ ప్రమోషన్స్ కోసం బాగా తిరిగేస్తున్నారు.ప్రమోషన్స్ లో భాగంగా ఆయన ఆధ్యాత్మిక యాత్రలు కూడా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే రీసెంట్ గా తిరుపతి వెళ్లిన తేజ్.. అక్కడ పరిసర ప్రాంతాల ప్రసిద్ధి దేవాలయాలని సందర్శించి పూజలు నిర్వహించాడు.ఇక తాజాగా ఆయన అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని(Sri Surya Narayana Swamy) దర్శించుకున్నాడు. సూర్య భగవానునికి ప్రత్యేక పూజలు నిర్వహించాడు.

సాయి దరమ్ తేజ్.. బ్రో సినిమా సక్సెస్ తో పాటు తన హెల్త్ గురించి స్వామిని వేడుకున్నట్లు, అలాగే అందరూ బావుండాలని కూడా కోరుకున్నట్లు చెప్పుకొచ్చాడు. అరసవల్లిలో ఆరోగ్యం కోసం మొక్కులు ఎక్కువగా మొక్కుతుంటారు. సాయి తేజ్ కూడా తన ఆరోగ్యం కోసం ఈ దేవాలయాన్ని సందర్శిచినట్టు తెలుస్తోంది. 2014 లో సాయి తేజ్ అరసవల్లి దేవాలయానికి వచ్చినట్లు మళ్ళీ ఇన్నాళ్ల తరువాత వచ్చినట్లు పేర్కొన్నాడు.

“నేను మా గురువు గారు కలసి బ్రో సినిమా చేశాం. ఆడియన్స్ అంచనాలకు కచ్చితంగా రీచ్ అవుతాం. ప్యాన్స్ అనుకున్న దానికంటే బ్రో సినిమా ఎక్కువ బావుంటుంది” అని అన్నారు. ఇక సాయి తేజ్ గతంలో బైక్ యాక్సిడెంట్ జరిగిన సంగతి తెలిసిందే.. ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడి.. మళ్లీ సినిమాలు స్టార్ట్ చేశాడు. అంతే కాదు విరూపాక్ష సినిమాతో బ్లక్ బస్టర్ హిట్ కొట్టాడు సాయి తేజ్. ఇక ఈసారి బ్రో సినిమాతో ఆడియన్స్ ముందుకురాబోతున్నాడు. ఈసినిమా తరువాత సాయితేజ్ 6 నెలలు బ్రేక్ తీసుకోబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.

Updated On 23 July 2023 1:38 AM GMT
Ehatv

Ehatv

Next Story