కొన్ని సినిమాలకు ఎలా అంత క్రేజ్‌ వస్తుందంటే ఇదమిద్ధంగా సమాధానంగానీ, సంజాయిషీగానీ చెప్పలేం. అంతే ప్రారంభించిన ఆ వేళా విశేషమో, లేదా ఆ ముహూర్తబలమో....సదరు సినిమాలకి ఆ వెలుగునీ, జిలుగునీ తెచ్చిపెడతాయంటే నమ్మితీరాలి. ఇప్పుడు సుప్రీం హీరో సాయిధర్మతేజ్‌ హీరోగా దండు కార్తీక్‌ దర్శకత్వంలో భోగవల్లి బాపినీడు నిర్మించిన విరూపాక్ష చిత్రం ప్రచారకార్యక్రమాలను ఆరంభించినప్పటినుంచీ అనూహ్యమైనరీతిలో ఊపందుకుంది. అది మరి ఎస్విసిసి బ్యానర్‌ మహిమో, అనుగ్రహమో! ఎవరినోట విన్నా విరూపాక్ష చిత్రం గురించే. అయితే నిర్మాత బాపినీడు చాలా విలక్షణమైన పోకడలో మొదలు పెట్టిన పాత్రల పరిచయం కార్యక్రమం దగ్గరనుంచీ చూస్తే అది తీసుకొచ్చిన సందడి ఇంతాఅంతా కాదు.

Updated On 19 April 2023 8:18 AM GMT
Ehatv

Ehatv

Next Story