ఆడలేక మద్దెల ఓడు అన్న సామెత ఉత్తినే పుట్టలేదు. గెలవడం చేతకాక నెపాన్ని అవతలిమీదకు నెట్టేయడం చాలా ఈజీ! రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(RCB) జట్టు అభిమానులు ఇప్పుడు అదే చేస్తున్నారు. బుర్రా బుద్ధీ లేకుండా ఆర్‌సీబీ జట్టు ఓటములకు ప్రధాన కారణం దివంగత స్టార్‌ మీరో పునీత్‌ రాజ్‌కుమార్‌(Puneeth Rajkumar) సతీమణి అశ్విని(Ashwini) అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.

ఆడలేక మద్దెల ఓడు అన్న సామెత ఉత్తినే పుట్టలేదు. గెలవడం చేతకాక నెపాన్ని అవతలిమీదకు నెట్టేయడం చాలా ఈజీ! రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(RCB) జట్టు అభిమానులు ఇప్పుడు అదే చేస్తున్నారు. బుర్రా బుద్ధీ లేకుండా ఆర్‌సీబీ జట్టు ఓటములకు ప్రధాన కారణం దివంగత స్టార్‌ మీరో పునీత్‌ రాజ్‌కుమార్‌(Puneeth Rajkumar) సతీమణి అశ్విని(Ashwini) అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. గత సీజన్‌లోలాగే ఈసారి కూడా ఆర్‌సీబీ జట్టు రాణించడం లేదు. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో ఒక్కదాంట్లో మాత్రమే విజయం సాధించింది. మార్చి 22వ తేదీన జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ చేతిలో పరాజయం పాలయ్యింది. పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. మూడో మ్యాచ్ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టుతో ఆడి ఓడిపోయింది. నాలుగో మ్యాచ్‌ లక్నో సూపర్‌ జెయింట్స్‌తో కూడా ఆర్‌సీబీ ఓడిపోయింది. అంటే నాలుగు మ్యాచ్‌లు ఆడి ఒక్కటి మాత్రమే గెలిచింది. మూడింటిలో ఓడిపోయింది. జట్టు ఇలా చెత్తగా ఆడటానికి కారణం అశ్విని అంటూ ఆర్‌సీబీ అభిమానులలో కొందరు ఆడిపోసుకుంటున్నారు. జట్టు వైఫల్యానికి కారణం ఆమెనే అంటూ అర్థంపర్థం లేని లాజిక్కులు చెబుతున్నారు. వారి కామెంట్లు చూస్తే వారికి మహిళల పట్ల కించిత్‌ గౌరవం కూడా లేదని అర్థమవుతోంది. ఐపీఎల్‌ ప్రారంభ సమయంలో రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు అన్‌బాక్స్‌ ఈవెంట్‌ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అశ్విని పునీత్‌ రాజ్‌కుమార్‌ విచ్చేశారు. ఆ జట్టు సభ్యుల కొత్త జర్సీలను కూడా ఆమెనే రివీల్‌ చేశారు. ఇలాంటి శుభ కార్యక్రమాలకు ఒక విధవరాలిని అతిథిగా పిలవడం ఏమిటంటూ ఆర్‌సీబీ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. భర్తలేని వ్యక్తితో ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడం వల్లే ఇప్పుడు ఆ జట్టు వైఫల్యం చెందుతుందని వారు చెబుతున్నారు. భర్తను కోల్పోయిన అశ్విని ఈ శుభకార్యక్రమంలో పాల్గొనడం దురదృష్టకరమంటూ దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. అశ్వినిని తప్పు పడుతూ ఒకడు వీడియో కూడా రిలీజ్‌ చేశాడు. ఇది చూసిన చాలామంది ఆ వ్యక్తి చేసిన పనిని తీవ్రంగా ఖండిస్తున్నారు. దీంతో అతను పోస్ట్ తొలగించాడు. అశ్వినిపై ఇలాంటి పోస్ట్‌లు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు పునీత్‌ రాజ్‌కుమార్‌ అభిమానులు ఫిర్యాదు చేశారు.

Updated On 6 April 2024 4:17 AM GMT
Ehatv

Ehatv

Next Story