వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు మాస్ మహారాజ్ రవితేజ(Ravi Teja). ప్లాప్ లు ఎదురైనా.. ఏమాత్రం తగ్గడంలేదు మాస్ హీరో. తాజాగా ఆయన సినిమా నుంచి రిలీజ్ అయిన కొత్త అప్ డేట్ అదరగొడుతోంది.

వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు మాస్ మహారాజ్ రవితేజ(Ravi Teja). ప్లాప్ లు ఎదురైనా.. ఏమాత్రం తగ్గడంలేదు మాస్ హీరో. తాజాగా ఆయన సినిమా నుంచి రిలీజ్ అయిన కొత్త అప్ డేట్ అదరగొడుతోంది.

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ హీరోగా యంగ్ డైరెక్టర్ వంశీ(Director vamsi) రచన దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ పాన్ ఇండియన్ మూవీ టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswar Rao). స్టువర్ట్ పురం గజదొంగ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ మాస్ యాక్షన్ మూవీలో నుపుర్ సనన్(Nupur sanon), గాయత్రీ భరద్వాజ్(Gayatri bharadwaj) హీరోయిన్లుగా నటిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఈసినిమాను నిర్మిస్తున్నారు.

ఒక ప్లాప్.. ఒక హిట్టు కొడుతూ.. సాలిడ్ హిట్ కోసం చూస్తున్నాడు రవితేజ. క్రాక్(Krack) తరువాత అంత పెద్ద హిట్టు సినిమా పడలేదు రవితేజకు అందుకే ఈసారి డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో ఆడియన్స్ ను పలకరించబోతున్నాడు. అప్పుడ కటారి కృష్ణ రియల్ స్టోరీతో.. క్రాక్ తెరకెక్కింది హిట్లు కొట్టాడు.. ఇక ఇప్పుడు గజదోంగ నాగేశ్వరరావు కథతో టైగర్ నాగేశ్వరావ్ కధతో సినిమా తెరకెక్కుతోంది. ఈసినిమాకూడా హిట్ అవుతుంది అని నమ్మకంతో ఉన్నారు.

జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ యొక్క ఫస్ట్ గ్లింప్స్ టీజర్ ని ఇన్వాషన్ పేరుతో నిన్న రిలీజ్ చేసారు మేకర్స్. కాగా ప్రస్తుతం ఈ గ్లింప్స్(glimpse) ప్రస్తుతం సూపర్ రెస్పాన్స్ తో 10 మిలియన్స్ కి పైగా వ్యూస్ అలానే 200కె కి పైగా లైక్స్ తో యూట్యూబ్ లో ట్రెండింగ్ లో దూసుకెళుతోంది. కాగా ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి దసరా పండుగ కానుకగా అక్టోబర్ 20న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.

Updated On 19 Aug 2023 3:03 AM GMT
Ehatv

Ehatv

Next Story