యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌(NTR), కేజీఎప్‌ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్(Prashanth neel)‌ కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తుందని చెప్పి చాలా రోజులే అవుతోంది.

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌(NTR), కేజీఎప్‌ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్(Prashanth neel)‌ కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తుందని చెప్పి చాలా రోజులే అవుతోంది. ఈ ప్రాజెక్టును లాస్టియర్‌ ప్రకటించారు. ఇప్పటివరకు షూటింగే మొదలు కాలేదు. ఈ సినిమా నుంచి ఎప్పుడెప్పుడు అప్‌డేట్‌లు వస్తాయా అని ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టులో షూటింగ్‌ మొదలవుతుందని మేకర్స్‌ ప్రకటించారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మిక మందన్న(Rashmika mandanna) నటించనున్నారట! అలాగే బాబీ డియోల్‌(Boddy deol) విలన్‌ పాత్రలో కనిపిస్తారట: దీనిపై అధికారిక ప్రకటన రాలేదు కానీ ఫిల్మ్‌ సర్కిల్‌లో బలంగా వినిపిస్తోంది. ప్రశాంత్‌ నీల్‌ ప్రస్తుతం సలార్‌ 2 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కంప్లీట్‌ అయ్యాక ఎన్టీఆర్‌ సినిమాను పట్టాలెక్కిస్తారు. ఈ సినిమాను కూడా ప్రశాంత్‌ నీల్‌ రెండు భాగాలుగా ప్లాన్‌ చేస్తున్నారని వినికిడి. ఇది నిజ‌మే అయితే మాత్రం ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు ఇంతకు మించిన సంబరం మరోటి ఉండదు. ఎందుకంటే ఇప్ప‌టికే ప్ర‌శాంత్ నీల్ కేజీఎఫ్ రెండు పార్టులుగా తీయ‌గా.. అవి ఆల్ టైం బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచాయి. మ‌రోవైపు స‌లార్ కూడా రెండు పార్టులుగా వ‌స్తుంది. మొదటిభాగం విజయం సాధించింది. సెకండ్‌ పార్ట్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

Eha Tv

Eha Tv

Next Story