విభిన్న పాత్రలను పోషించడంలో దిట్ట అయిన స్టార్‌ హీరో విక్రమ్‌(Vikram) ప్రస్తుతం తంగలాన్‌(thangalan) సినిమాలో నటిస్తున్నారు. పా.రంజిత్‌(Pa.Ranjith) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత విక్రమ్‌ చేయబోయే సినిమాలో హీరోయిన్‌గా రష్మిక మందన్న(Rashmika) నటిస్తున్నారు.

విభిన్న పాత్రలను పోషించడంలో దిట్ట అయిన స్టార్‌ హీరో విక్రమ్‌(Vikram) ప్రస్తుతం తంగలాన్‌(thangalan) సినిమాలో నటిస్తున్నారు. పా.రంజిత్‌(Pa.Ranjith) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత విక్రమ్‌ చేయబోయే సినిమాలో హీరోయిన్‌గా రష్మిక మందన్న(Rashmika) నటిస్తున్నారు. 2018లో కేరళల వచ్చిన వరదల నేపథ్యంలో 2018 అనే మలయాళ సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్ జూడ్‌ ఆంథోనీ జోసెఫ్‌(anthony Joseph).. ఈ సినిమా మలయాళంలో అద్భతమైన విజయాన్ని సాధించింది. రికార్డు కలెక్షన్లను రాబ్టటింది. తెలుగులో కూడా ఈ సినిమాను డబ్‌ చేసి విడుదల చేశారు. కాగా జూడ్‌ ఆంథోనీ జోసెఫ్‌ తన తర్వాతి చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌లో చేయనున్నారు. ఈ సినిమాలో విక్రమ్‌ హీరోగా నటిస్తారని కోలీవుడ్ టాక్‌. భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్న ఈ సినిమాను సుభాస్కర్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా రష్మిక మందన్న, మాళవిక మోహనన్‌ పేర్లు వినిపించాయి. అయితే రష్మిక మందన్నను ఎంపిక చేశారని, అతి త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన వెలువడుతుందని సమాచారం. విక్రమ్‌– రష్మిక జోడీ అధికారికంగా ఓకే అయితే మాత్రం రష్మికకు ఇది మూడో తమిళ సినిమా అవుతుంది. ఇంతకు ముందు కార్తీతో సుల్తాన్‌లోనూ, దళపతి విజయ్‌తో వారిసు సినిమాలోనూ రష్మిక నటించారు.

Updated On 7 Aug 2023 8:30 AM GMT
Ehatv

Ehatv

Next Story