విజయ్‌ దేవరకొండ(Vijay Devarkonda), రష్మిక మందన్నలది(Rashmika) క్రేజీ కాంబినేషన్‌...వీరిద్దరు కలిసి నటించిన గీతగోవిందం(Geetha Govindham) సినిమా సూపర్‌ డూపర్‌ హిట్టయ్యింది. ఆ తర్వాత విజయ్‌ దేవరకొండ, రష్మిక కలిసి డియర్‌ కామ్రేడ్‌ సినిమాలో నటించారు. ఫీల్‌గుడ్‌ ప్రేమకథతో రూపుదిద్దుకున్న ఈ సినిమాకు భరత్‌ కమ్మ(Bharath Kamma) దర్శకత్వం వహించాడు. 2019లో విడుదల ఈ సినిమా

విజయ్‌ దేవరకొండ(Vijay Devarkonda), రష్మిక మందన్నలది(Rashmika) క్రేజీ కాంబినేషన్‌...వీరిద్దరు కలిసి నటించిన గీతగోవిందం(Geetha Govindham) సినిమా సూపర్‌ డూపర్‌ హిట్టయ్యింది. ఆ తర్వాత విజయ్‌ దేవరకొండ, రష్మిక కలిసి డియర్‌ కామ్రేడ్‌ సినిమాలో నటించారు. ఫీల్‌గుడ్‌ ప్రేమకథతో రూపుదిద్దుకున్న ఈ సినిమాకు భరత్‌ కమ్మ(Bharath Kamma) దర్శకత్వం వహించాడు. 2019లో విడుదల ఈ సినిమా ఆశించినంతగా విజయవంతం కాలేదు. కానీ ఆ సినిమాలో విజయ్‌-రష్మిక జంట మాత్రం అందరినీ ఆకట్టుకుంది. బుధవారంతో ఈ సినిమా విడుదలయ్యి నాలుగేళ్లు అవుతోంది. 2019, జులై 26న సినిమా విడుదలయ్యింది. ఈ నేపథ్యంలోనే రష్మిక డియర్‌ కామ్రేడ్‌ను(Comrade) ఉద్దేశిస్తూ సోషల్‌ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. విజయ్‌, దర్శకుడు భరత్‌తో దిగిన ఓ ఫొటోను రష్మిక మందన్న షేర్‌ చేశారు ‘‘నా హృదయంలో ఈ సినిమాకు ఎప్పటికీ ఒక ప్రత్యేకస్థానం ఉంటుంది. ‘డియర్‌ కామ్రేడ్‌’కు నాలుగేళ్లు. థ్యాంక్యూ విజయ్‌, భరత్‌’’ అని అందులో రాశారు రష్మిక. రు. దీనికి, ఆమె.. కపుల్‌ ముద్దు పెట్టుకుంటున్న ఎమోజీని జత చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెటిజన్ల దృష్టిని అమితంగా ఆకర్షిస్తోంది. డియర్‌ కామ్రెడ్‌ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి ఏ సినిమాలోనూ నటించలేదు. ప్రస్తుతం రష్మిక మందన్న పాన్‌ ఇండియా మూవీ పుష్ప 2లో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్‌లో యానిమల్‌లో నటిస్తున్నారు. పుష్ప -1 సినిమా తర్వాత రష్మికకు బాలీవుడ్‌లో వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇక విజయ్‌ దేవరకొండ విషయానికి వస్తే ఈయన ఖుషి కాకుండా మరో రెండు సినిమాలు చేస్తున్నారు.

Updated On 27 July 2023 7:20 AM GMT
Ehatv

Ehatv

Next Story