నిన్ను చూస్తే గర్వంగా ఉంది. ఇలాగే నువ్వు మరింత ఎత్తుకు ఎదగాలి

ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ తన వార్షిక 30 అండర్ 30 జాబితాను ప్రకటించింది. 30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 30 మంది “ట్రయల్‌బ్లేజర్స్ అండ్ డిస్ట్రప్టర్స్”ను ఎంపిక చేసింది. ఎంటర్టైన్మెంట్ రంగం నుండి ముగ్గురు నటీమణులు రాధికా మదన్, రష్మిక మందాన, డాట్ ఉన్నారు.

27 ఏళ్ల రష్మిక కు నేషనల్ క్రష్ అనే పేరు వచ్చింది. ఆమె తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటిస్తోంది. గత ఏడాది ఆమె తమిళంలో విజయ్ తో కలిసి వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో వచ్చిన 'వారిసు'లో నటించింది. సిద్ధార్థ్ మల్హోత్రా సరసన శంతను బాగ్చి డైరెక్ట్ చేసిన స్పై థ్రిల్లర్ మిషన్ మజ్నులో నటించింది. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో తెరకెక్కిన ఫ్యామిలీ క్రైమ్ డ్రామా యానిమల్ లో కథానాయికగా నటించింది. హిందీ, తెలుగుతో పాటు ఇతర భాషల్లో విడుదలైన ఈ చిత్రం ప్రపంచ బాక్సాఫీస్ వద్ద రూ.900 కోట్లకు పైగా వసూలు చేసింది.

ఫోర్బ్స్‌ ఇండియా మ్యాగజైన్ ‘30 అండర్ 30’ జాబితాలో చోటు దక్కించుకున్న రష్మిక కు సినీ నటుడు విజయ్‌ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపాడు. రష్మిక మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నట్టు వ్యాఖ్యానించాడు. ‘‘నిన్ను చూస్తే గర్వంగా ఉంది. ఇలాగే నువ్వు మరింత ఎత్తుకు ఎదగాలి’’ అంటూ పోస్ట్ పెట్టాడు. మ్యాగజైన్ కవర్ ఫొటోను షేర్ చేసిన రష్మిక తన అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది.

Updated On 15 Feb 2024 10:26 PM GMT
Yagnik

Yagnik

Next Story