అల్లు అర్జున్‌(Allu Arjun) హీరోగా వచ్చిన పుష్ప(Pushpa) సినిమాలో రష్మిక మందన్న(Rashmika Mandanna) పోషించిన శ్రీవల్లి పాత్ర బాగా పాపులరయ్యింది. ఆ పాత్రలో రష్మిక పర్‌ఫెక్ట్‌గా నటించింది. కాకపోతే శ్రీవల్లి పాత్ర తనకు బాగా సూటయ్యేదని ఈ మధ్యన ఓ ఇంటర్వ్యూలో నటి ఐశ్వర్య రాజేశ్‌(Aishwarya Rajesh) అన్నారు. ఆమె ఏ ఉద్దేశంతో అన్నారో తెలియదు కానీ రష్మిక అభిమానులు బాగా ఫీలయ్యారు.

అల్లు అర్జున్‌(Allu Arjun) హీరోగా వచ్చిన పుష్ప(Pushpa) సినిమాలో రష్మిక మందన్న(Rashmika Mandanna) పోషించిన శ్రీవల్లి పాత్ర బాగా పాపులరయ్యింది. ఆ పాత్రలో రష్మిక పర్‌ఫెక్ట్‌గా నటించింది. కాకపోతే శ్రీవల్లి పాత్ర తనకు బాగా సూటయ్యేదని ఈ మధ్యన ఓ ఇంటర్వ్యూలో నటి ఐశ్వర్య రాజేశ్‌(Aishwarya Rajesh) అన్నారు. ఆమె ఏ ఉద్దేశంతో అన్నారో తెలియదు కానీ రష్మిక అభిమానులు బాగా ఫీలయ్యారు. సోషల్‌ మీడియాలో ఐశ్వర్య రాజేశ్‌ మీద కామెంట్లు పెట్టడం మొదలు పెట్టారు. ఐశ్వర్య రాజేశ్‌ ఫ్యాన్స్‌ ఊరుకుంటారా? వారు కూడా కౌంటర్లు ఇవ్వసాగారు. ఈ గొడవ ముదరక ముందే ఇద్దరు హీరోయిన్లు సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టి గొడవ సద్దుమణిగేలా చేశారు.

తన మాటల్ని కొందరు వక్రీకరించారని, రష్మిక మందన్నను కించపరిచేలా తాను ఎక్కడా మాట్లాడలేదని ఐశ్వర్య రాజేష్‌ తెలిపారు. పుష్ప సినిమాలో రష్మిక మందన్న నటన తనకు ఎంతగానో నచ్చిందని, అబద్ధపు ప్రచారాలతో ఇద్దరి మధ్య విభేదాలు సృష్టించొద్దని ఐశ్వర్య రాజేష్‌ తన ఫాన్స్‌కు విజ్ఞప్తి చేసింది. ఈ కామెంట్‌కు రష్మిక మందన్న రియాక్టయ్యారు. 'ఈ వివాదం కాస్త ఆలస్యంగా నా దృష్టికి వచ్చింది. ఐశ్వర్య..నువ్వేమిటో నాకు తెలుసు. నీ మాటల్ని నేను పూర్తిగా అర్థం చేసుకున్నా. నువ్వు ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ మీద నాకు గొప్ప గౌరవం ఉంది. ‘ఫర్హానా’లో నువ్వు చాలా అద్భుతంగా నటించావు’ అంటూ ప్రశంసలతో ముంచెత్తింది రష్మిక. ఈ విధంగా ఇద్దరు నటిమణులు వివాదానికి స్వస్తి చెప్పారు.

Updated On 20 May 2023 1:27 AM GMT
Ehatv

Ehatv

Next Story