బాలీవుడ్‌ అగ్రహీరో రణ్‌వీర్‌ సింగ్‌(Ranveer singh)-అగ్ర కథానాయిక దీపిక పడుకొనే(Deepika padukone) జంట విడిపోతున్నారా? ఈ అనుమానం ఇప్పుడు చాలా మందికి కలుగుతోంది. ఎందుకంటే రణ్‌వీర్‌సింగ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌(Instagram) అకౌంట్‌ నుంచి పెళ్లి ఫోటోలను(Marriage) పూర్తిగా డిలీట్‌ చేశాడు. ఒక్కటంటే ఒక్క పెళ్లి ఫోటో కూడా లేదు. 2023కు ముందున్న ఫోటోలన్నింటినీ తీసివేయడంతో అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు.

బాలీవుడ్‌ అగ్రహీరో రణ్‌వీర్‌ సింగ్‌(Ranveer singh)-అగ్ర కథానాయిక దీపిక పడుకొనే(Deepika padukone) జంట విడిపోతున్నారా? ఈ అనుమానం ఇప్పుడు చాలా మందికి కలుగుతోంది. ఎందుకంటే రణ్‌వీర్‌సింగ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌(Instagram) అకౌంట్‌ నుంచి పెళ్లి ఫోటోలను(Marriage) పూర్తిగా డిలీట్‌ చేశాడు. ఒక్కటంటే ఒక్క పెళ్లి ఫోటో కూడా లేదు. 2023కు ముందున్న ఫోటోలన్నింటినీ తీసివేయడంతో అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. గత కొంతకాలంగా రణ్‌వీర్‌సింగ్‌-దీపికా పదుకొనే విడిపోతున్నారంటూ కథనాలు వస్తున్నాయి. సోషల్‌ మీడియాలో బోల్డన్ని స్టోరీలు వచ్చాయి. అయితే ఈ కథనాలను దీపికా ఖండించింది. తమ మధ్య ఎలాంటి అభిప్రాయభేదాలు లేవని, ఇద్దరం అన్యోన్యంగా ఉంటున్నామని తెలిపింది. ఇప్పుడు రణ్‌వీర్‌ సింగ్‌ ఫోటోలు డిలీట్ చేయడంతో వీరి బంధంపై అనుమానాలు వస్తున్నాయి. అబ్బే.. రణవీర్‌ ఉద్దేశపూర్వకంగా ఫోటోలను తొలగించకపోవచ్చునని, ఏదైనా టెక్నికల్‌ ఎర్రర్‌తో అలా జరిగి ఉండవచ్చని నెటిజన్లు అనుకుంటున్నారు. అయితే ఈ విషయంలో రణ్‌వీర్‌, దీపికలలో ఎవరో ఒకరు రియాక్టయితే తప్ప క్లారిటీ రాదు. 2018లో రణ్‌వీర్‌సింగ్‌-దీపికా పదుకొనే పెళ్లి చేసుకున్నారు. సెప్టెంబర్‌లో వీళ్లు తల్లిదండ్రులు కాబోతున్నారు. ఇలాంటి సమయంలో రణ్‌వీర్‌సింగ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ నుంచి పెళ్లి ఫొటోలను డిలీట్‌ చేయడం అభిమానులను కలవరపరుస్తున్నది.

Updated On 9 May 2024 5:07 AM GMT
Ehatv

Ehatv

Next Story