రన్‌ మిషిన్‌ విరాట్‌ కోహ్లీ(Virat Kohli) ఇప్పటికే బోల్డన్నీ రికార్డును సొంతం చేసుకున్నాడు. మిగిలిన అరకొర రికార్డులపై కూడా కన్నేశాడు. బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే ప్రపంచకప్‌(One day Worldcup) సెమీఫైనల్లో కూడా అద్భుతమైన సెంచరీని సాధించాడు. ఈ క్రమంలో వన్డేలలో 50వ సెంచరీని చేసి, సచిన్‌(Sachin) 49 శతకాల రికార్డును బద్దలు కొట్టాడు. ఇప్పుడు ఆ పరుగుల వీరుడి బయోపిక్‌పై సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది.

రన్‌ మిషిన్‌ విరాట్‌ కోహ్లీ(Virat Kohli) ఇప్పటికే బోల్డన్నీ రికార్డును సొంతం చేసుకున్నాడు. మిగిలిన అరకొర రికార్డులపై కూడా కన్నేశాడు. బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే ప్రపంచకప్‌(One day Worldcup) సెమీఫైనల్లో కూడా అద్భుతమైన సెంచరీని సాధించాడు. ఈ క్రమంలో వన్డేలలో 50వ సెంచరీని చేసి, సచిన్‌(Sachin) 49 శతకాల రికార్డును బద్దలు కొట్టాడు. ఇప్పుడు ఆ పరుగుల వీరుడి బయోపిక్‌పై సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది. కోహ్లీ బయోపిక్‌లో(Kohli Biopic) ఎవరు నటిస్తారన్న ఆసక్తి అందరిలోనూ పెరిగింది. అయితే దీనిపై బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌(Ranbir Kapoor) తన మనసులో మాట చెప్పారు. ముంబాయిలో జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించిన రణ్‌బీర్‌ స్టేడియంలో కాసింత సందడి కూడా చేశారు. ఆయన తాజాగా నటిస్తున్న సినిమా యానిమల్‌. అర్జున్‌రెడ్డి ఫేమ్‌ సందీప్‌రెడ్డి వంగ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్‌లలో భాగంగానే మ్యాచ్‌కు వచ్చాడు రణ్‌బీర్‌. ఈ సందర్భంగా ఆయన కోహ్లీ బయోపిక్‌ గురించి మాట్లాడాడు. విరాట్ కోహ్లీ బయోపిక్‌లో మీరు నటించాలని అనుకుంటున్నారా? అని యాంకర్‌ అడిగిన ప్రశ్నకు రణ్‌బీర్‌ చక్కటి సమాధానం చెప్పారు. 'కోహ్లీ బయోపిక్‌ సినిమాగా తీస్తే మాత్రం అందులో హీరోగా అతడే నటించాలి. ఎందుకంటే విరాట్‌ ఇండియాలో ఉన్న చాలా మంది నటుల కంటే అందంగా, ఫిట్‌గా ఉంటాడు. అందుకే ఆ పాత్రను కోహ్లీనే పోషించాలి' అని చెప్పాడు. రణ్‌బీర్‌ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Updated On 16 Nov 2023 6:04 AM GMT
Ehatv

Ehatv

Next Story