మెగా కుటుంబం అయోధ్యకు చేరుకుంది. రామ మందిర ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు ప్రత్యేక విమానంలో చిరంజీవి, సురేఖ దంపతులు, గ్లోబల్‌ స్టార్ రామ్ చరణ్‌ అయోధ్య చేరుకున్నారు. మధ్యాహ్నం.. రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో మెగాస్టార్ కుటుంబం పాల్గొననుంది. మెగాస్టార్, రామ్ చరణ్ అయోధ్యకు పయనమైన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

మెగా కుటుంబం(Mega Family) అయోధ్య(Ayodhha)కు చేరుకుంది. రామ మందిర ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు ప్రత్యేక విమానంలో చిరంజీవి, సురేఖ దంపతులు (Chiranjeevi, Surekha couple), గ్లోబల్‌ స్టార్ రామ్ చరణ్‌(Globalstar Ram Charan )అయోధ్య చేరుకున్నారు. మధ్యాహ్నం.. రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన (Ram Lalla idol Installation) కార్యక్రమంలో మెగాస్టార్ కుటుంబం పాల్గొననుంది. మెగాస్టార్, రామ్ చరణ్ అయోధ్యకు పయనమైన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. మరోవైపు ఇలాంటి మహత్తర కార్యక్రంలో పాల్గొనేందుకు ఆ‎హ్వానం రావడం తన పూర్వ జన్మ సుకృతమని మెగాస్టార్ ట్వీట్ చేశారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. తనకు ఈ క్షణాలు జీవితాంతం గుర్తుంటాయని చిరంజీవి భాగోద్వేగంతో చెప్పారు. ఇదంతా ఇష్టదైవం హనుమంతుడి ఆశీర్వాదంగా భావిస్తున్నట్టు వ్యాఖ్యానించారు. ఇక..అయోధ్యలో తమ గుర్తుగా ఉండడానికి శ్రీరాములవారికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి చిరు కానుకగా ఇవ్వబోతున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ కానుక ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోవాలని.. మెగా కుటుంబం అనుకుంటుందట. అంతేకాదు అయోధ్యలో తెలుగువారి గుర్తులను ఉంచడం కోసం తెలుగువారి తరుపున మెగా కుటుంబం అరుదైన, అద్భుతమైన కానుకను అందించబోతున్నట్లు తెలుస్తోంది.

Updated On 21 Jan 2024 11:44 PM GMT
Ehatv

Ehatv

Next Story