రీసెంట్‏గా జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)తో కలిసి నటించనున్నట్టు శివ రాజ్‏కుమార్ (Shiva Rajkumar) అనౌన్స్‏మెంట్ ఇచ్చారు. వీరిద్దరూ చాలా ఏళ్లుగా సన్నిహితంగా ఉంటున్నారు. అయితే 2017లో వచ్చిన గౌతమిపుత్ర శాతకర్ణి (Gautamiputra Satakarni)లో కేమియో రోల్ మాత్రమే కనిపించారు ఆయన.

రీసెంట్‏గా జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)తో కలిసి నటించనున్నట్టు శివ రాజ్‏కుమార్ (Shiva Rajkumar) అనౌన్స్‏మెంట్ ఇచ్చారు. వీరిద్దరూ చాలా ఏళ్లుగా సన్నిహితంగా ఉంటున్నారు. అయితే 2017లో వచ్చిన గౌతమిపుత్ర శాతకర్ణి (Gautamiputra Satakarni)లో కేమియో రోల్ మాత్రమే కనిపించారు ఆయన. శివన్న గ్రాండ్‏గా అనౌన్స్‏మెంట్ ఇచ్చిన తర్వాత ఈ కాంబినేషన్ మామూలుగా ఉండదని టాక్ వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం రెండు భాగాలు రూపొందే ఈ చిత్రంలో సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా భాగం అవనున్నారట. మొదటి భాగంలో శివరాజ్ కుమార్, రెండవ భాగంలో నందమూరి బాలకృష్ణ జైలర్ పాత్ర పోషించనున్నారు. బాలయ్య బాబు, రజినీకాంత్ హీరోలుగా తెరకెక్కనున్న ఈ చిత్రం రెండో భాగం షూటింగ్ జరుగుతోందట.

శివన్న- బాలకృష్ణ, రజినీకాంత్ (Rajinikanth) నటిస్తున్న రెండు భాగాల ఈ ప్రాజెక్టు కోసం సూపర్ ఎగ్జైటింగ్‏గా ఉన్నారు. ఈ ప్రాజెక్టు కోసం కన్నడ డైరెక్టర్‏ను తీసుకోవాలని చూస్తున్నారట. ఇందులో డైరెక్టర్ హర్ష (Harsha)ను కన్ఫఫార్మ్ చేశారని.. ఇప్పటి వరకు అధికారంగా ఎలాంటి అనౌన్స్‏మెంట్ చేయలేదు. ఇక ఈ డైరెక్టర్‏తో శివరాజ్‏కుమార్ గతంలో కలిసి పనిచేశారు. వీరిద్దరూ భజరంగి, వజ్రకాయ, భజరంగి 2 సినిమాలను చేశారు.

కాగా ఈ ప్రాజెక్ట్‏ను శివ రాజ్‏కుమార్ సొంత బ్యానర్ అయిన గీతా పిక్చర్స్‏పై నిర్మించబోతున్నారట. అయితే శివన్న భార్య గీతా శివ రాజ్‏కుమార్ డిసెంబర్ 2022లో నిర్మాతగా మారారు.ముఫ్తీ ఫేమ్ నర్తన్ (Narthan) దర్శకత్వంలో వస్తున్న భైరతి రణగల్ చిత్రం గీతా పిక్చర్స్ బ్యానర్‏పై తెరకెక్కనుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్టులపై అభిమానులు చాలా ఎగ్జైట్‏మెంట్‏తో ఉన్నారు. ఈ అనౌన్స్‏మెంట్లు ఎప్పుడు వస్తాయో చూడాలి మరి.

Updated On 23 May 2023 3:13 AM GMT
Ehatv

Ehatv

Next Story