రాజేంద్ర ప్రసాద్(Rajend raPrasad) సంచలన వ్యాఖ్యలు చేశారు. సీనియర్ నటుడు నరేష్(Naresh) పై ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. నరేష్ ను రాజేంద్ర ప్రసాద్ ఎందుకు అన్నారు. ఈ వ్యాఖ్యలపై నరేష్ రెస్పాన్స్ ఏంటీ..?

రాజేంద్ర ప్రసాద్(Rajend raPrasad) సంచలన వ్యాఖ్యలు చేశారు. సీనియర్ నటుడు నరేష్(Naresh) పై ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. నరేష్ ను రాజేంద్ర ప్రసాద్ ఎందుకు అన్నారు. ఈ వ్యాఖ్యలపై నరేష్ రెస్పాన్స్ ఏంటీ..?

అన్నీ మంచి శకునములే సినిమాలో కలిసి నటించారు నరేష్(Naresh).. రాజేంద్ర ప్రసాద్(Rajendra Prasad). యంగ్ హీరో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నటించిన సినిమా మంచి శకునములే. నందినీ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ మూవీకి సబంధించిన టీజర్ కు మంచి రెస్పాన్స్ రాగా.. రీసెంట్ గా ఈమూవీ టైటిల్ సాంగ్ లాంచ్ ఈవెంట్ ను అట్టహాసంగా చేశారు. ఈ ఈవెంట్ కు దాదాపు మూవీ టీమ్ అంతా వచ్చారు. ఈ నేపథ్యంలో.. రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) మాట్లాడుతూ.. నరేష్ నిత్య పెళ్లి కొడుకు అంటూ హాట్ కామెంట్స్ చేశారు. దాంతో అంతా ఒకేసారి షాక్ అయ్యారు. అయితే నరేష్ మాత్రం ఈ వ్యాఖ్యలు లైట్ తీసుకున్నారు. ఎందుకు నరేష్ ఈ కామెంట్స్ ను లైట్ తీసుకున్నారంటే..?

రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad)మాట్లాడుతూ సీనియర్ నటుడు నరేష్‌(Naresh)పై చమత్కార బాణాలు విసిరారు. మీడియా రాజేంద్ర ప్రసాద్ - నరేష్ గురించి ప్రశ్నిస్తూ.. రెండు కత్తులు ఓ వరలో ఇమడవు కదా అని అడిగారు. అయితే దానికి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ... తాను కత్తిని కాదని, నరేష్ మాత్రం పెద్ద కత్తేననన్నారు. తాను వర మాత్రమే అంటూ కామెంట్స్ చేశారు రాజేంద్ర ప్రసాద్. ఆడు మామూలు కత్తి కాదు.. ఆ విషయం మీ అందరికి తెలుసు బాగా కత్తి వాడు అంటూ.. వాడి రేంజ్ కత్తి మేము వాడం అంటూ సరదాగా కామెడీ చేశారు.ఇలా అంటూనే నరేష్(Naresh) తన తమ్ముడు అంటూ.. ప్రేమగా దగ్గరకు తీసుకున్నారు. ఇక మళ్లీ మొదలెట్టారు.. చూశారా పెళ్లి కొడుకులా ఉన్నాడు కదా.. అని అన్నారు. పెళ్లికొడుకు ఏంటీ నేను నిత్యం పెళ్లికొడుకేగా ఉంటాను అన్నారు నరేష్. దాంతో రాజేంద్ర ప్రసాద్ మళ్ళీ అందుకుని నిజంగా నువ్వు నిత్య పెళ్లికొడుకువు రా అంటూ కామెంట్ చేశారు రాజేంద్ర ప్రసాద్. ఈ కామెంట్లతో అక్కడ నవ్వులు పూశాయి.

అయితే నరేష్ (Naresh) కూడా రాజేంద్ర ప్రసాద్(Rajendra Prasad) వ్యాక్యలు సీరియస్‌గా తీసుకోలేదు. తనను తానే నిత్య పెళ్లికొడుకు అనుకున్నాడు నరేశ్(Naresh). అయితే ఇటు సోషల్ మీడియా మాత్రం ఈ వ్యాఖ్యలను వైరల్ చేస్తోంది. రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలు నెట్టింట్ల జోరుగా షికారు చేస్తున్నాయి. ఇక అన్నీ మంచి శకునములే సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా, ప్రమోషన్లలో పాల్గొంటోంది మూవీ టీమ్. ఇక ఈ ఈవెంట్ లో సీనియర్ నటులు నరేష్(Naresh), రాజేంద్ర ప్రసాద్(Rajendra Prasad), దర్శకురాలు నందినీ రెడ్డి, హీరో హీరోయిన్లు సంతోష్ శోభన్, మాళవిక నాయర్, గౌతమి, వాసుకి తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమా ఇష్టంగా చేశామని, అందరికీ ఈ సినిమా నచ్చుతుందని నందినీ రెడ్డి అన్నారు. అలాగే ఈ సినిమాలో నటించిన నటీనటులను ఉగాది షడ్రుచులతో పోలుస్తూ వేదికపైకి పిలిచారు నందినీ రెడ్డి.

Updated On 24 March 2023 12:10 AM GMT
Ehatv

Ehatv

Next Story