భారీ అంచనాలు ఉన్న SSMB29 సినిమాను ... అంతే స్థాయిలో తెరకెక్కించేందుకు జక్కన్న సీరియస్ గా ప్లాన్ చేస్తున్నారు.

రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారో మన అందరికి తెలిసిందే . ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డ్ రావడంతో రాజమౌళి నెక్ట్స్ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలే పెరిగాయి . టాలీవుడ్ ఇండస్ట్రీలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌళి తన నెక్ట్స్ మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే . ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే ఇప్ప‌టి వ‌ర‌కు రూపొంద‌ని విధంగా రూ.800 కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్‌తో SSMB 29ను రూపొందించ‌టానికి రాజ‌మౌళి ప్లాన్ చేసినట్లు సమచారం.

అయితే వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా రావాలని ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కు... అది కాస్తా RRR తర్వాత ఆ కల నెరవేరనుంది. అయితే భారీ అంచనాలు ఉన్న SSMB29 సినిమాను ... అంతే స్థాయిలో తెరకెక్కించేందుకు జక్కన్న సీరియస్ గా ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఈ మూవీ కోసం ఓ హాలీవుడ్ ముద్దుగుమ్మను ఈ సినిమాలో తీసుకొనున్నట్లు తెలుస్తోంది . సినిమాపై క్యూరియాసిటీ.. సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో సినిమా అంటే ఎక్స్పెక్టేషన్స్ మాములుగా ఉండవు కదా అందుకే .... జక్కన్న, టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో కలయికలో సినిమా రావాలని గత కొన్నేళ్ల నుంచి ఫ్యాన్స్ , ఆడియన్స్ , సినీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వీరిద్దరి కాంబోలో SSMB29గా సినిమా రానున్నట్లు ప్రకటించినప్పటి నుంచి సినిమాపై రోజు రోజుకి క్యూరియాసిటీ పెరుగుతూవస్తోంది.

మరోవైపు రాజమౌళి SSMB29 కోసం ఆయన పూర్తిస్థాయిలో స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారని టాక్ వస్తోంది . గతంలో ఒకసారి రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత, దర్శకుడు కె. విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వూలో చెప్పిన దాన్ని బట్టి చూస్తే మహేశ్ బాబుతో చేయబోయే సినిమా అమెజాన్ అడవుల్లో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుంది అని టాక్ వినబడుతోంది. RRR ఎఫెక్ట్.. విజయేంద్ర ప్రసాద్ చెప్పినట్లుగానే ఇండియానా జోన్స్ వంటి యాక్షన్ అండ్వెంచరస్ సినిమాగా ఉండనుందని ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. ఇక రాజమౌళి SSMB29 కోసం ఒక ప్రముఖ హాలీవుడ్ గ్రాఫిక్స్ సంస్థతో కూడా ప్రాజెక్టు గురించి చర్చలు జరిపినట్లు క్లారిటీ వచ్చింది. ముందుగానే గ్రాఫిక్స్ విషయంలో కూడా ఒక ప్లాన్ రెడీ చేసుకుంటున్నారని అర్థమవుతోంది.

ఇప్పటికే హాలీవుడ్ సంస్థ క్రియేటివ్ ఆర్టిస్ట్ ఏజెన్సీ తో భాగం అయినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సంస్థ ప్రముఖ హాలీవుడ్ నటీనటులను సినిమాలో నటించేందుకు ఒప్పిస్తుంది. ఇప్పటికే అవేంజర్ విలన్, థోర్ హీరో క్రిస్ హేమ్స్ వర్త్ SSMB29లో నటిస్తారని టాక్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా హీరోయిన్ గా హాలీవుడ్ నటిని రంగంలోకి దించనున్నారట మన జక్కన్న. అయితే ఆమె ఎవరనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది . అంతేకాకుండా ఈ సినిమాను హాలీవుడ్ స్థాయిలో గ్లోబల్ రేంజ్ యాక్షన్ అడ్వంచరస్ థ్రిల్లర్ గా తెరకెక్కించనున్నారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో పూజా కార్యక్రమాలను చేసి.. వచ్చే ఏడాది ప్రథమార్థంలో SSMB29ను తెరకెక్కించాలని రాజమౌళి ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం.

Updated On 18 March 2023 2:25 AM GMT
Ehatv

Ehatv

Next Story