తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి హీరో రాజ్ తరుణ్(Raj tharun) మోసం చేశాడంటూ లావణ్య(Lavanya) అనే యువతి నార్సింగి పోలీస్ స్టేషన్‌లో(Narsingh Police Station) ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి హీరో రాజ్ తరుణ్(Raj tharun) మోసం చేశాడంటూ లావణ్య(Lavanya) అనే యువతి నార్సింగి పోలీస్ స్టేషన్‌లో(Narsingh Police Station) ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. 11 ఏళ్లుగా తాను, రాజ్ తరుణ్ రిలేషన్‌లో (Relation)ఉన్నామని, తామిద్దరం గుడిలో రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నామని చెబుతోంది. ఓ సినీ హీరోయిన్‌తో అఫైర్ పెట్టుకుని తనను వదిలేశాడని ఆరోపిస్తోంది. అయితే లావణ్య ఆరోపణలను రాజ్‌తరుణ్‌ ఖండించాడు. తాను లావణ్యతో రిలేషన్‌షిప్‌లో ఉన్నమాట వాస్తవమేనని, 2014 నుంచి 2017 వరకు కలిసే ఉన్నామని రాజ్‌తరుణ్‌ చెప్పాడు. ఆ తర్వాత తమ ఇద్దరి మధ్య ఎలాంటి శారీరక సంబంధాలు లేవని స్పష్టం చేశాడు. మొదటి నుంచి లావణ్య తనను బెదిరించేదని, మీడియాకు వెళ్లి అంతుచూస్తానని చెప్పేదని రాజ్‌తరుణ్‌ పేర్కొన్నాడు. 'లావణ్య తనను ఎంతగా టార్చర్‌ పెట్టినా ఎక్కడ నా రిపుటేషన్‌ దెబ్బతింటుందేమోనని మౌనంగా భరించాను. తర్వాత ఆమె డ్రగ్స్‌కు అలవాటు పడింది. డ్రగ్‌ కేసులో జైలుకు కూడా వెళ్లి వచ్చింది. ఈ కేసు కూడా నేనే పెట్టించానని నా మీద అరచింది. ఇది జరిగిన తర్వాత ఆమె మరో అబ్బాయితో రిలేషన్‌షిప్‌లో ఉన్నది. వారిద్దరు కలిసి నా ఇంట్లోనే ఉన్నారు. వారి ప్రవర్తనతో విసుగు చెంది నేనే బయటకు వచ్చేశాను. మా ఇద్దరికి పెళ్లయ్యిందన్నది పచ్చి అబద్ధం. అసలు నేను పెళ్లికి వ్యతిరేకం. జీవితంలో పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశం నాకు లేదు. నేను హైదరాబాద్‌కు వచ్చిన కొత్తలో లావణ్య చాలా సాయం చేసింది. ఆ గ్రాట్యిడుడ్‌ తోనే నేను ఇంతకాలం ఆమెను భరించి వచ్చాను. కన్నతండ్రిని కూడా లావణ్య మోసం చేసింది. నటి మౌల్వీ మల్హోత్రాతో(Malvi Malhotra) నేను కలిసి ఉంటున్నానని లావణ్య చేస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదు. నేను ఉంటున్నది హైదరాబాద్‌లో. మౌల్వీ ఉండేది ముంబాయిలో.. ఎలా కలిసి ఉంటాం?' అని రాజ్‌తరుణ్‌ చెప్పుకొచ్చాడు.

Eha Tv

Eha Tv

Next Story