2021లో పుష్ప: ది రైజ్ (Pushpa:The Rise) సినిమా బ్లాక్ బస్టర్‏గా నిలిచి ఓ రికార్డు సృష్టించింది. అల్లు అర్జున్ (Allul Arjun), రష్మిక మందన్న (Rashmika mandanna) జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్ (Sukumar)దర్శకత్వం వహిస్తున్నారు.పుష్ప: ది రైజ్‏కు సీక్వెల్‏గా వస్తున్న పుష్ప: ది రూల్ పై భారీ అంచనాలు ఉన్నాయి.

2021లో పుష్ప: ది రైజ్ (Pushpa:The Rise) సినిమా బ్లాక్ బస్టర్‏గా నిలిచి ఓ రికార్డు సృష్టించింది. అల్లు అర్జున్ (Allul Arjun), రష్మిక మందన్న (Rashmika mandanna) జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్ (Sukumar)దర్శకత్వం వహిస్తున్నారు.పుష్ప: ది రైజ్‏కు సీక్వెల్‏గా వస్తున్న పుష్ప: ది రూల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుండటంతో అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది. నిర్మాతలు వరుస షెడ్యూళ్లను పూర్తి చేసేస్తున్నారు.

ఈ షూటింగ్‏కు సంబంధించిన కీలక అప్‏డేట్‏ను చిత్ర బృందం ప్రకటించింది. ఫహద్ షాసిల్, దర్శకుడు సుకుమార్ బీటీఎస్ ఫొటోను షేర్ చేస్తూ.. భన్వర్ సింగ్ షెకావత్ ఎపిసోడ్ షూటింగ్ పూర్తి అయిందని చిత్ర టీమ్ ప్రకటించింది. ఈ చిత్రంలో ఇప్పుడు మొత్తం రివేంజ్ బ్యాక్ డ్రాప్ లోనే ఉండనుంది. సౌత్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన నటిస్తున్న ఈ చిత్రంపై హై ఎక్స్‏పెక్టేషన్స్ ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మిస్తున్న ఈ సినిమాలో మలయాళం హీరో ఫహద్ ఫాజిల్ (Fahadh Faasil), అనసూయ భరద్వాజ్(Anasuya Bharadwaj), సునీల్ (Sunil), జగదీష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) మ్యూజిక్ అందిస్తున్నారు.

Updated On 18 May 2023 5:35 AM GMT
Ehatv

Ehatv

Next Story