పుష్ప -2(Pushpa-2) సినిమా నటీనటులు ప్రయాణిస్తున్న ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి(Narketpally) దగ్గర హైదరాబాద్‌-విజయవాడ హైవేపై(High Way) ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. ఈ సంఘటనలో చాలా మంది ఆర్టిస్టులకు గాయాలయ్యాయి.

పుష్ప -2(Pushpa-2) సినిమా నటీనటులు ప్రయాణిస్తున్న ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి(Narketpally) దగ్గర హైదరాబాద్‌-విజయవాడ హైవేపై(High Way) ఆర్టీసీ(RTC) బస్సును ఢీ కొట్టింది. ఈ సంఘటనలో చాలా మంది ఆర్టిస్టులకు గాయాలయ్యాయి. గాయపడినవారిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. శ్రీకాకుళం(srikakulam) పరిసర ప్రాంతాలలో పుష్ప -2 షూటింగ్‌ జరిగింది. అందులో పాల్గొన్న నటీనటులు మంగళవారం రాత్రి హైదరాబాద్‌కు ఓ ప్రైవేటు బస్సులో బయలుదేరారు.

బుధవారం తెల్లవారు జామున నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి శివారులోకి రాగానే వీరు ప్రయాణిస్తున్న బస్సు అదుపు తప్పింది. అక్కడే ఆగివున్న ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ప్రైవేటు బస్సులో ఉన్న పలువురు ఆర్టిస్టులు స్వల్పంగా గాయపడ్డారు. అల్లు అర్జున్‌(Allu Arjun) హీరోగా సుకుమార్‌(sukumar) దర్శకత్వం వహించిన పుష్ప సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రెండేళ్ల కిందట వచ్చిన ఈ సినిమా పాన్‌ ఇండియా లెవల్లో సక్సెస్‌ అయ్యింది. ఈ సినిమాతోనే అల్లు అర్జున్‌కు పాన్‌ ఇండియా రేంజ్‌లో గుర్తింపు వచ్చింది. ఇందులో హీరోయిన్‌గా నటించిన రష్మిక మందన్నా కూడా ఓవర్‌నైట్‌ నేషనల్‌ స్టార్‌ అయ్యారు.

Updated On 31 May 2023 1:51 AM GMT
Ehatv

Ehatv

Next Story