బ్లాక్ బాస్టర్ సైంటిఫిక్ డ్రామా ఇస్మార్ట్ శంకర్ (iSmart Shankar) చిత్రం విడుదలై దాదాపు నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఆ కాంబో రిపీట్ అవబోతోంది. పూరీ జగన్నాథ్, చార్మికౌర్ జంటగా ఇస్మార్ట్ శంకర్‏కు సీక్వెల్‏గా డబుల్ ఇస్మార్ట్ (Double iSmart) చిత్రాన్ని రూపొందించనున్నారు.

బ్లాక్ బాస్టర్ సైంటిఫిక్ డ్రామా ఇస్మార్ట్ శంకర్ (iSmart Shankar) చిత్రం విడుదలై దాదాపు నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఆ కాంబో రిపీట్ అవబోతోంది. పూరీ జగన్నాథ్, చార్మికౌర్ జంటగా ఇస్మార్ట్ శంకర్‏కు సీక్వెల్‏గా డబుల్ ఇస్మార్ట్ (Double iSmart) చిత్రాన్ని రూపొందించనున్నారు. డైరెక్టర్ పూరీ జగన్నాథ్, చార్మి ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా మార్చి 8, 2024లో శివరాత్రి సందర్భంగా థియేటర్లలో విడుదల చేస్తున్నామని ప్రకటించారు. రామ్ పోతినేని పుట్టినరోజు (మే15)కు ముందు రోజు అంటే ఆదివారం టైటిల్, సినిమా విడుదల తేదీని అఫిషియల్‏గా అనౌన్స్ చేశారు.

పూరీ కనెక్ట్స్ బ్యానర్‏పై రూపొందుతున్న ఈ డబుల్ ఇస్మార్ట్ (Double iSmart) చిత్రం డబుల్ మాస్‏తోపాటు డబుల్ ఎంటర్‏టైన్‏మెంట్ ఇస్తుందని మేకర్స్ అంటున్నారు. అయితే ఈ డబుల్ ఇస్మార్ట్ టైటిల్ పోస్టర్‏లో బ్లడ్ మార్క్స్‏తో ఉన్న త్రిశూలాలను చూపించారు. ఈ పోస్టర్ సీక్వెల్ స్టోరీ లైన్ గురించి హింట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమా తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇక ఈ చిత్రం మంచి బడ్జెట్ అండ్ టెక్నికల్ వాల్యూస్‏తో నిర్మిస్తున్నామని నిర్మాతలు అంటున్నారు.

Updated On 15 May 2023 1:01 AM GMT
Ehatv

Ehatv

Next Story