మలయాళ స్టార్‌ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌(Prithviraj Sukumaran) ప్రమాదానికి గురయ్యారు. మరయూర్‌ బస్టాండ్‌లో విలాయత్‌ బుద్ధ సినిమా(Vilayath Buddha Movie) షూటింగ్‌లో ఆయన ప్రమాదానికి గురయ్యారు. సినిమాకు సంబంధించిన కొన్ని భారీ యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా పృథ్వీరాజ్‌కు ప్రమాదం సంభవించింది. కేఎస్‌ఆర్‌టీసీ బస్సులో ఓ పోరాట సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో ఆయన జారి కిందపడ్డారు.

మలయాళ స్టార్‌ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌(Prithviraj Sukumaran) ప్రమాదానికి గురయ్యారు. మరయూర్‌ బస్టాండ్‌లో విలాయత్‌ బుద్ధ సినిమా(Vilayath Buddha Movie) షూటింగ్‌లో ఆయన ప్రమాదానికి గురయ్యారు. సినిమాకు సంబంధించిన కొన్ని భారీ యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా పృథ్వీరాజ్‌కు ప్రమాదం సంభవించింది. కేఎస్‌ఆర్‌టీసీ బస్సులో ఓ పోరాట సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో ఆయన జారి కిందపడ్డారు. దీంతో ఆయన కాలికి గాయమయ్యింది. వెంటనే ఆయనను చికిత్స కోసం కొచ్చిలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. ఇవాళ ఆయనకు శస్త్రచికిత్స జరుగుతుంది. ఈ ఆపరేషన్‌ తర్వాత పృథ్వీరాజ్‌ దాదాపు మూడు నెలలు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంటుందట! మూడు నెలల పాటు షూటింగ్‌లకు దూరం ఉండాల్సివస్తే మాత్రం నిర్మాతలకు కొంచెం ఇబ్బందే! పృథ్వీరాజ్‌ గాయంపై ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మరయూర్‌లో గంధపు చెక్కల వెలికితీతకు సంబంధించిన ఇతివృత్తంతో విలాయత్‌ బుద్ధ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ కొన్ని నెలలుగా మరయూర్‌లోనే జరుగుతోంది. పవన కల్యాణ్‌, రానా నటించిన భీమ్లా నాయక్‌ మలయాళ మాతృకలో రాణా పోషించిన పాత్రను వేసింది పృథ్వీరాజే! ఆయన నటించిన డ్రైవింగ్‌ లైసెన్స్‌, జనగణమన ఇత్యాది సినిమాలు తెలుగువారికి బాగా నచ్చాయి. ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న సలార్‌లో పృథ్వీరాజ్‌ సుకుమారన్ ప్రధాన విలన్‌ పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటకే ఆయన ఫస్ట్‌లుక్‌ విడుదలయ్యి అమితంగా ఆకట్టుకుంటోంది.

Updated On 26 Jun 2023 12:47 AM GMT
Ehatv

Ehatv

Next Story