ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఏం పవన్‌ కల్యాణ్‌ మంగళవారం మీడియాతో ఆవేశంగా మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఏం పవన్‌ కల్యాణ్‌ మంగళవారం మీడియాతో ఆవేశంగా మాట్లాడారు. హిందువుల గురించి మాట్లాడితే ప్రకాశ్‌రాజ్‌కు సంబంధం ఏమిటని పవన్‌ ప్రశ్నిస్తూ ఇంకా చాలా చాలా అన్నారు. దానికి ప్రకాశ్‌రాజ్‌ రియాక్టయ్యారు. నేను అన్నదేమటి? నువ్వు చెబుతున్నదేమిటి? అని పవన్‌ను ప్రశ్నించారు ప్రకాశ్‌రాజ్‌.. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు. 'శ్రీ పవన్‌కల్యాణ్‌గారు.. నేను ఇప్పుడే మీ ప్రెస్‌మీట్‌ను చూశాను. నేను చెప్పిందేమిటి? దాన్ని మీరు అపార్థం చేసుకుని తిప్పుతున్నదేమిటి? నేను ఇప్పుడు విదేశాలలో షూటింగ్‌లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకు సమాధానం చెబుతాను. ఈ మధ్యలో మీకు వీలైతే నా ట్వీట్‌ను మళ్లీ చదవండి. అర్థం చేసుకోండి. ప్లీజ్‌!' అంటూ ట్వీట్ చేశారు.

Eha Tv

Eha Tv

Next Story