ఎన్నో అంచనాలను పెట్టుకున్న ఆదిపురుష్‌ సినిమా ప్రభాస్‌ (Prabhas ) ఫ్యాన్స్‌నే కాదు, సినిమా అభిమానులను కూడా నిరాశ పరిచింది. ప్రభాస్‌ అభిమానులు డీలా పడ్డారు. బాహుబలి -2 తర్వాత ప్రభాస్‌కు హిట్‌ లేకపోవడం వీరిని కలచివేస్తున్నది. సాహో సినిమా బాక్సాఫీస్‌ దగ్గర తన్నేసింది. ఎంతో గొప్పగా చెప్పుకున్న రాధేశ్యామ్‌ (Radhe Shyam) కూడా అంతంత మాత్రంగానే ఆడింది. తాజా పౌరాణిక చిత్రం ఆదిపురుష్‌ కూడా ఆశించిన మేర విజయాన్ని సాధించలేకపోయింది. పైగా అనేక విమర్శలను ఎదుర్కొంది.

ఎన్నో అంచనాలను పెట్టుకున్న ఆదిపురుష్‌ సినిమా ప్రభాస్‌ (Prabhas ) ఫ్యాన్స్‌నే కాదు, సినిమా అభిమానులను కూడా నిరాశ పరిచింది. ప్రభాస్‌ అభిమానులు డీలా పడ్డారు. బాహుబలి -2 తర్వాత ప్రభాస్‌కు హిట్‌ లేకపోవడం వీరిని కలచివేస్తున్నది. సాహో సినిమా బాక్సాఫీస్‌ దగ్గర తన్నేసింది. ఎంతో గొప్పగా చెప్పుకున్న రాధేశ్యామ్‌ (Radhe Shyam) కూడా అంతంత మాత్రంగానే ఆడింది. తాజా పౌరాణిక చిత్రం ఆదిపురుష్‌ కూడా ఆశించిన మేర విజయాన్ని సాధించలేకపోయింది. పైగా అనేక విమర్శలను ఎదుర్కొంది. ఇప్పుడు ఆదిపురుష్‌ ఫలితం సంగతిని పక్కన పెట్టి రాబోయే సలార్‌ ముచ్చట్లు చెప్పుకోవడం మొదలు పెట్టారు ప్రభాస్‌ ఫ్యాన్స్‌.. మరోవైపు సలార్‌ సందడి కూడా మొదలయ్యింది. ఈ వారమే టీజర్‌ విడుదల అవుతోంది. టీజర్‌ రిలీజ్‌ కోసం ఈ నెల 7వ తేదీని హుమూర్తంగా నిర్ణయించారు. టీజర్‌ సందడికి కౌంట్‌డౌన్‌ మొదలైందని సినీవర్గాలు ఆదివారం స్పష్టం చేశాయి. కేజీఎఫ్‌ (KGF) ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్‌కు జోడిగా శ్రుతిహాసన్‌ నటిస్తున్నారు.

హోంబలే ఫిలింస్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కె.జి.ఎఫ్‌. చిత్రాల తర్వాత ప్రశాంత్‌ నీల్‌ - హోంబలే సంస్థ కలయికలో రూపొందుతున్న సినిమా ఇదే కావడంతో ఆసక్తితో పాటు అంచనాలు కూడా పెరిగాయి. ఈ సినిమా పై పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్‌ 28వ తేదీన అనేక భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated On 3 July 2023 2:39 AM GMT
Ehatv

Ehatv

Next Story