పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మూవీ ప్రాజెక్ట్ K పై ఓ గాసిప్ వైరల్ అవుతోంది. ఈ మూవీని టూ పార్ట్స్ చేయనున్నారని ఫిల్మ్ నగర్ లో టాక్. ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై ఫస్ట్ నుంచే ఇటు ప్రభాస్ ఫ్యాన్స్ లోనూ అటు కామన్ ఆడియన్స్ లోనూ భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో పొడుగు కాళ్ల సుందరి దీపికా పదుకొనే హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ […]

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మూవీ ప్రాజెక్ట్ K పై ఓ గాసిప్ వైరల్ అవుతోంది. ఈ మూవీని టూ పార్ట్స్ చేయనున్నారని ఫిల్మ్ నగర్ లో టాక్. ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై ఫస్ట్ నుంచే ఇటు ప్రభాస్ ఫ్యాన్స్ లోనూ అటు కామన్ ఆడియన్స్ లోనూ భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో పొడుగు కాళ్ల సుందరి దీపికా పదుకొనే హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ మెయిన్ క్యారెక్టర్ చేస్తుండటంతో మరింత హైప్ క్రీయేట్ అయింది.

ఆదిపురుష్, సలార్ సినిమాలు కూడా టూ పార్ట్స్ అనే ప్రచారం ఉండటంతో ఇప్పుడు కొత్తగా ఈ ప్రాజెక్ట్ కూడా టూ పార్ట్స్ ఉంటుందని నెటిజన్లు అనుకుంటున్నారు. అయితే రీసెంట్ గా టాలీవుడ్ బజ్ ప్రకారం ఆ న్యూస్ ఫేక్ అని.. ప్రాజెక్ట్ కె ఒకటే సినిమాగా రాబోతుందంటున్నారు.

ఈ సినిమాను మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నారు. మూవీకి సంగీతం మిక్కీ జే మేయర్ అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా డానీ శంచెజ్ లోపెజ్ పని చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. ఫైనల్ గా ఈ సినిమా టూ పార్ట్స్ గా తీస్తున్నారా లేక ఒకటేనా తెలియాలంటే మేకర్స్ అఫీషియల్ స్టేట్ మెంట్ కోసం వెయిట్ చేయాల్సిందే మరి. 2024లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నట్టు సమాచారం.

Updated On 2 Feb 2023 2:22 AM GMT
Ehatv

Ehatv

Next Story