దేశంలో ఇప్పుడు తెలుగు డైరెక్టర్ల హవా కొనసాగుతోందనే చెప్పాలి. పాన్‌ ఇండియా డైరెక్టర్లుగా మన తెలుగు డైరెక్టర్లు మారిపోతున్నారు. బోల్డ్‌ కంటెంట్‌ చిత్రాలతో టాప్‌డైరెక్టర్ల స్థానంలో నిలిచిన సందీప్‌రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) రీసెంట్‌గా యానిమల్‌ చిత్రంతో బ్లాక్‌ బ్లాస్టర్‌ కొట్టారు. యానిమల్‌ హిట్ కొట్టడంతో సందీప్‌రెడ్డి వంగా తదుపరి సినిమాపై సినీ ప్రియులకు ఆసక్తి నెలకొంది.

దేశంలో ఇప్పుడు తెలుగు డైరెక్టర్ల హవా కొనసాగుతోందనే చెప్పాలి. పాన్‌ ఇండియా డైరెక్టర్లుగా మన తెలుగు డైరెక్టర్లు మారిపోతున్నారు. బోల్డ్‌ కంటెంట్‌ చిత్రాలతో టాప్‌డైరెక్టర్ల స్థానంలో నిలిచిన సందీప్‌రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) రీసెంట్‌గా యానిమల్‌ చిత్రంతో బ్లాక్‌ బ్లాస్టర్‌ కొట్టారు. యానిమల్‌ హిట్ కొట్టడంతో సందీప్‌రెడ్డి వంగా తదుపరి సినిమాపై సినీ ప్రియులకు ఆసక్తి నెలకొంది.

అయితే సంక్రాంతి(sankranti) సంబరాలకు భీమవరం వెళ్లిన పాన్‌ ఇండియా దర్శకుడు సందీప్‌రెడ్డిని అడ్డుకుని ప్రభాస్‌ ఫ్యాన్స్‌ హల్‌చల్‌ చేశారు. ప్రభాస్‌తో(Prabhas) నెక్స్ట్‌ సినిమాపై అప్‌డేట్‌ ఇవ్వాలని కోరారు. ప్రభాస్‌తో పాన్‌ ఇండియా సినిమా తీసి గట్టి హిట్‌ కొట్టాలని ఆయన ఫ్యాన్స్‌ సందీప్‌రెడ్డిని కోరారు. యానిమల్‌ సినిమా చాలా బాగుందని.. ఆ సినిమాతో మీ రేంజ్‌ ఎక్కడికో వెళ్లిపోయిందని ప్రభాస్‌ ఫ్యాన్స్‌ అన్నారు. ప్రభాస్‌తో చేయబోయే సినిమా విశేషాలను తెలపాలని కోరారు. ప్రభాస్‌తో ఈ ఏడాది సెప్టెంబర్‌ నుంచి స్పిరిట్‌(Spirit) అనే సినిమాను చేయబోతున్నానని గతంలో దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా ప్రకటించారు. స్పిరిట్‌ సినిమా విశేషాలు చెప్పాలని ఒత్తిడి చేశారు. ప్రభాస్‌తో సినిమా వేరే లెవెల్లో ఉండాలని.. యానిమిల్‌ను మించి హిట్‌ కొట్టాలని వారు కోరారు. అందుకు సందీప్‌రెడ్డి కూడా సానుకూలంగానే స్పందించారు. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ కోరిన వాటికి కూల్‌గా ఓకే, థ్యాంక్యూ అంటూ స్పందించారు. సందీప్‌రెడ్డికి హ్యాప్పీగా ప్రభాస్‌ ఫ్యాన్స్‌ వీడ్కోలు పలికారు.

Updated On 17 Jan 2024 6:10 AM GMT
Ehatv

Ehatv

Next Story