ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తోన్న లేెటస్ట్ పీరియాడిక్ మూవీ ‘ఆదిపురుష్’. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మూవీ టీమ్ విడుదల చేసింది. ఓమ్ రౌత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. టీ-సిరీస్ ఈ భారీ పీరియాడిక్ సినిమాను నిర్మిస్తున్నారు.

ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తోన్న లేెటస్ట్ పీరియాడిక్ మూవీ ‘ఆదిపురుష్’. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మూవీ టీమ్ విడుదల చేసింది. ఓమ్ రౌత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. టీ-సిరీస్ ఈ భారీ పీరియాడిక్ సినిమాను నిర్మిస్తుంది. రామాయణం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్.. మోషన్ పోస్టర్లను విడుదల చేసిన టీమ్.. తాజాగా ట్రైలర్ విడుదలతో సినిమాపై మరింత హిప్ క్రియేట్ చేసింది.

ఈ సినిమా విడుదలకు మరో నెల రోజులు మాత్రమే ఉంది.. జూన్ 16 న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ చిత్రంలో ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తుండగా, కృతి సనన్ సీత పాత్రలో నటిస్తున్నారు. ఇక లంకాధిపతి రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించడం విశేషం. ఆదిపురుష్ విడుదలకు ముందే ఒక ఘనత సాధించింది... న్యూయార్క్‌లోని ట్రిబెకా ఫెస్టివల్‌లో అంతర్జాతీయ ప్రీమియర్‌కు సెలెక్ట్ కావడం ద్వారా ఓ గొప్ప మైల్ స్టోన్ ను సాధించింది. ఈ సినిమా భారత దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 70 దేశాలలో విడుదల కావడం విశేషం.

Updated On 9 May 2023 3:33 AM GMT
Ehatv

Ehatv

Next Story