ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఆదిపురుష్‌ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకకు సకల నన్నాహాలు చేస్తున్నారు. మరికొద్ది గంటల్లో ఈ వేడుక అంగరంగ వైభవంగా జరగబోతున్నది. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో జరిగే ఈ వేడక కోసం ఫ్యాన్స్ ఇప్పటికే తిరుపతి చేరుకున్నారు. భారతీయ సినీ చరిత్రలోనే నభూతో నభవిష్యత్‌ అన్న రీతిలో ఈ వేడుక జరగనుంది. . ఇక ఇప్పటికే ప్రభాస్ తో పాటు చిత్రబృందం తిరుపతికి చేరుకుంది.

ప్రభాస్‌(Prabhas) కథానాయకుడిగా నటిస్తున్న ఆదిపురుష్‌ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకకు సకల నన్నాహాలు చేస్తున్నారు. మరికొద్ది గంటల్లో ఈ వేడుక అంగరంగ వైభవంగా జరగబోతున్నది. తిరుపతి(Tirupathi)లోని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియం(Sri Venkateswara University Stadium)లో జరిగే ఈ వేడక కోసం ఫ్యాన్స్ ఇప్పటికే తిరుపతి చేరుకున్నారు. భారతీయ సినీ చరిత్రలోనే నభూతో నభవిష్యత్‌ అన్న రీతిలో ఈ వేడుక జరగనుంది. . ఇక ఇప్పటికే ప్రభాస్ తో పాటు చిత్రబృందం తిరుపతికి చేరుకుంది. ఈ క్రమంలో ప్రభాస్ తెల్లవారుజామునే సంప్రదాయ పంచె కట్టులో తిరుమల శ్రీవారి సప్రభాత సేవలో పాల్గోన్నాడు. పంచె కట్టులో ప్రభాస్ ను చూసి ఫ్యాన్స్‌ తెగ సంబరపడిపోతున్నారు. స్వామివారి దర్శనానంతరం ప్రభాస్ గెస్ట్ హౌస్ కు వచ్చాడు. అక్కడ ఆయనను చూడటానికి అభిమానులు ఎగబడ్డారు. ఫ్యాన్స్‌ను కంట్రోల్‌ చేయడానికి పోలీసులకు చాలా కష్టమయ్యింది. సాయంత్రం ఆరు గంటలకు మొదలయ్యే ప్రీ రిలీజ్ వేడుక కోసం ముంబాయి నుంచి రెండొందల మంది సింగర్స్, రెండొందల మంది డ్యాన్సర్లు వస్తున్నారు. సంగీత ద్వయం అజయ్-అతుల్ జై శ్రీరామ్ పాటను లైవ్ గా ప్రదర్శించబోతున్నారు. చిన్న జీయర్ స్వామి అతిథిగా రానున్న ఈ ప్రీ రిలీజ్ వేడుకలో యాక్షన్ ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు. రీసెంట్‌గా విడుదలైన ట్రైలర్‌ యూ ట్యూబ్‌ను షేక్‌ చేస్తోంది. చాలా మంది అద్భుతంగా ఉందని కితాబిస్తున్నారు. మొదట్లో టీజర్‌ను ఆడిపోసుకున్నవారు కూడా ట్రైలర్‌ను చూసి ఆశ్చర్యపోతున్నారు. వేసవిలో సరైన సినిమా లేక ప్రేక్షకులు నిరాశ చెందుతున్న సమయంలో ఆదిపురుష్‌ విడుదల కాబోతున్నది. ముందుగా అనుకున్నట్లుగా గత సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేసి ఉంటే కచ్చితంగా కలెక్షన్ల ప్రభావం పడుండేది కానీ ఇప్పుడు సోలోగా వస్తుంది. రామాయణం ఇతిహాసం ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహించాడు. ప్రభాస్ రాముడిగా.. కృతిసనన్ సీతగా కనిపించనున్నారు. ఇక బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ లంకాధిపతి రావణాసురుడుగా నటిస్తున్నాడు. ఈ సినిమాను తెలుగులో పీపుల్ మీడియా సంస్థ రిలీజ్ చేస్తుంది. ఇప్పటికే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు జీఎస్టీతో కలిసి 185 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆ రేంజ్ లో బిజినెస్ జరిగిన సినిమా ఇదే. పైగా కేవలం ప్రభాస్ బ్రాండ్ నేమ్ తోనే ఈ రేంజ్ లో ప్రీ బిజినెస్ జరిగింది.

Updated On 6 Jun 2023 2:30 AM GMT
Ehatv

Ehatv

Next Story