తిరుపతిలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‏లో ‘ఆదిపురుష్’ (Adipurush) సినిమా ట్రైలర్‏ను విడుదల చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‏కు లక్ష మందికిపైగా అభిమానులు వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చారు. దీంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. గతంలో రిలీజ్ చేసిన టీజర్‏లో విజువల్ ఎఫెక్ట్స్ సరిగాలేవని విమర్శలను ఎదుర్కొన్నారు మేకర్స్. కొత్తగా రిలీజైన ట్రైలర్‏లో విజువల్ ఎఫెక్ట్స్ క్వాలిటీ కనిపిస్తోంది.

తిరుపతిలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‏లో ‘ఆదిపురుష్’ (Adipurush) సినిమా ట్రైలర్‏ను విడుదల చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‏కు లక్ష మందికిపైగా అభిమానులు వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చారు. దీంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. గతంలో రిలీజ్ చేసిన టీజర్‏లో విజువల్ ఎఫెక్ట్స్ సరిగాలేవని విమర్శలను ఎదుర్కొన్నారు మేకర్స్. కొత్తగా రిలీజైన ట్రైలర్‏లో విజువల్ ఎఫెక్ట్స్ క్వాలిటీ కనిపిస్తోంది. రావణాసురుడు జానకిని కిడ్నాప్ చేసే సీన్ నుంచి మొదలు పెడితే చివరి వరకు సీజీఐ వర్క్ అద్భుతంగా ఉన్నట్టు మనకు కనిపిస్తోంది. అయినా కూడా ఇప్పటికీ కొన్ని సీన్స్ కార్టూన్స్‏లా ఉన్నాయని అంటున్నారు కొందరు. ముఖ్యంగా వానరాలు, వార్ సీన్స్‏లో సీజీఐ లోపం ఉందని అంటున్నారు. అయిప్పటికీ ప్రభాస్ అభిమానులు ట్రైలర్‏కు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ అయిన కొన్ని నిమిషాల్లోనే భారీ వ్యూస్‏ను సొంతం చేసుకుంది. ఏది ఏమైనా 2023 జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా ‘ ఆదిపురుష్’ చిత్రం విడుదలకాబోతోంది. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్ (Prabhas), కృతిసనన్ (Kriti Sanon), సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్, దేవదత్త నాగే నటించారు.

Updated On 7 Jun 2023 12:18 AM GMT
Ehatv

Ehatv

Next Story