మొన్నటి వరకు తెలుగులో అగ్రస్థానంలో ఉన్న నటి పూజా హెగ్డే(Pooja Hegde).. అసలు పూజా ఉంటే సినిమా హిట్టనే నమ్మకానికి వచ్చేశారు దర్శక నిర్మాతలు. దాదాపు అగ్ర హీరోలందరి సరసన ఆమె నటించారు. అయితే ఈ మధ్యే ఆమె సినిమా కెరీర్‌ గ్రాఫ్‌ కొంచెం పడిపోయింది. కొన్ని సినిమాలు పరాజయం పాలు కావడం, ఒప్పుకున్న సినిమాలు కొన్ని ఆలస్యం కావడం వంటి కారణాలు ఆమె తెరమీద ఎక్కువగా కనిపించకుండా చేశాయి.

మొన్నటి వరకు తెలుగులో అగ్రస్థానంలో ఉన్న నటి పూజా హెగ్డే(Pooja Hegde).. అసలు పూజా ఉంటే సినిమా హిట్టనే నమ్మకానికి వచ్చేశారు దర్శక నిర్మాతలు. దాదాపు అగ్ర హీరోలందరి సరసన ఆమె నటించారు. అయితే ఈ మధ్యే ఆమె సినిమా కెరీర్‌ గ్రాఫ్‌ కొంచెం పడిపోయింది. కొన్ని సినిమాలు పరాజయం పాలు కావడం, ఒప్పుకున్న సినిమాలు కొన్ని ఆలస్యం కావడం వంటి కారణాలు ఆమె తెరమీద ఎక్కువగా కనిపించకుండా చేశాయి. బాలీవుడ్‌లో మాత్రం తరచూ అవకాశాలు అందుకొంటూనే ఉంది. తెలుగులో ఆమె అధికారికంగా ఒప్పుకున్న సినిమా ‘గుంటూరు కారం’(Guntur Karam) మాత్రమే. అయితే ఇప్పుడు ఆ సినిమా నుంచి కూడా తప్పుకున్నట్టు తెలుస్తోంది. మహర్షి(maharshi) సినిమా తర్వాత హీరో మహేశ్‌బాబుతో(Mahesh Babu) పూజా హెగ్డే నటించాల్సిన సినిమా ఇదే.

ఇందులో శ్రీలీల(Sreeleela) మరో హీరోయిన్‌గా నటిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌(Trivikram) దీనికి దర్శకత్వం వహిస్తుండగా, ఎస్‌.రాధాకృష్ణ(S. Radha Krishna) సినిమాను నిర్మిస్తున్నారు. వివిధ కారణాల వల్ల గుంటూరు కారం సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ వాయిదా పడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో కాల్షీట్లు సర్దుబాటు చేయలేక చిత్రం నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని పూజా హెగ్డే అంటున్నారు. ప్రస్తుతం తమిళంలో(tamil) ఓ చిత్రం, కన్నడంలో(kanadam) ఓ చిత్రం, హిందీలో(Hindi) ఓ చిత్రంతో పాటు కొన్ని యాడ్స్‌(advertisement) కూడా కమిటయ్యారు పూజా. ప్రస్తుతానికి ఆమె చేతిలో తెలుగు సినిమాలేవీ లేనట్టే. గుంటూరు కారం నుంచి పూజా హెగ్డే తప్పుకోవడంతో మొదట సెకండ్‌ హీరోయిన్‌గా తీసుకున్న శ్రీలీలను ప్రధాన కథానాయికగా ఫిక్స్‌ చేసింది చిత్ర యూనిట్‌. అలాగే సెకండ్‌ హీరోయిన్‌ కోసం ఇప్పుడు సంయుక్తా మీనన్‌ను సంప్రదిస్తున్నారట.

Updated On 22 Jun 2023 2:57 AM GMT
Ehatv

Ehatv

Next Story