టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే(Pooja Hegde) ప్రస్తుతం వరుస ప్లాప్ సినిమాలతో ఇబ్బంది పడుతోంది. స్టార్ డమ్ వచ్చిన తరువాత తాను చేసిన పాన్ ఇండియా సినిమాలు బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో దిక్కు తోచని స్థితిలో ఉండిపోయింది.. బ్యూటీ. ఇక ప్రస్తుతం ఆమె చెతిలో పెద్దగా సినిమాలు కూడా లేవు. అయితే తాజాగా పూజా హెగ్డేకు సంబంధించి ఒక వార్త వెలుగులోకి వచ్చి హల్ చల్ చేస్తుంది.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే(Pooja Hegde) ప్రస్తుతం వరుస ప్లాప్ సినిమాలతో ఇబ్బంది పడుతోంది. స్టార్ డమ్ వచ్చిన తరువాత తాను చేసిన పాన్ ఇండియా సినిమాలు బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో దిక్కు తోచని స్థితిలో ఉండిపోయింది.. బ్యూటీ. ఇక ప్రస్తుతం ఆమె చెతిలో పెద్దగా సినిమాలు కూడా లేవు. అయితే తాజాగా పూజా హెగ్డేకు సంబంధించి ఒక వార్త వెలుగులోకి వచ్చి హల్ చల్ చేస్తుంది.

పూజా హెగ్డేని చంపేస్తామని బెదిరింపులు(Threat) వ‌చ్చాయని సోషల్ మీడియా(Social media) కోడై కూస్తోంది. ఆమెకు బెదిరింపు రావడం ఏంటీ అటూ.. వార్తలు వైరల్ అయ్యాయి. పూజా రీసెంట్‌గా దూబాయ్ వెళ్ల‌గా.. ఆక్కడ ఒక ఈవెంట్​లో ఆమె గొడవ పడిందని.. ఈ కారణంగా పూజా​కు హత్యా బెదిరిపులు వచ్చాయని నెట్టింట వార్తలు గుప్పుమన్నాయి. దాంతో ఇండస్ట్రీలో ఈ విషయం గురించి రకరకాలుగా గుసగుసలాడుకుంటున్నారు.

ఇక ఈ విషయంలో పూజ ఫ్యాన్స్ కు భయం స్థార్ట్ అయ్యింది. తమ అభిమాన హీరోయిన్ గురించి ఆందోళన చెందుతున్నారు. . అయితే తాజాగా ఈ వార్త‌ల‌పై పూజా టీమ్ స్పందించింది.పూజా హెగ్డేని చంపేస్తామని వ‌చ్చిన బెదిరింపులు అబ‌ద్ద‌మ‌ని పూజా టీమ్ తెలిపింది. ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని హీరోయిన్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఈ ఫేక్ ప్రచారాలు ఎవరు స్టార్ట్ చేశారో తెలియదు. అదంతా పూర్తిగా అవాస్తవం అని పూజా టీమ్ చెప్పుకోచ్చింది.

ప్రస్తుతం పూజా హెగ్డే బాలీవుడ్ లో సినిమాలు చేస్తోంది. కోయి షక్‌ అనే హిందీ సినిమాలో నటిస్తోంది. షాహిద్‌ కపూర్‌ హీరోగా వ‌స్తున్న ఈ సినిమాను మలయాళ దర్శకుడు రోషన్‌ ఆండ్రూస్‌ తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీతో అయినా హిట్ కొట్టి.. తనుకు ఉన్న చెడ్డ పేరును తీసేసుకోవాలి అని చూస్తోంది బ్యూటీ.

Updated On 14 Dec 2023 7:51 AM GMT
Ehatv

Ehatv

Next Story