ఐశ్వర్యరాయ్(Aishwarya Rai), చియాన్ విక్రమ్(Chiyan Vikram) జంటగా మణిరత్నం(Manirathnam) దర్శకత్వంలో వ‌చ్చిన‌ 'పొన్నియిన్ సెల్వన్-2′(PS-II) చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. అయితే మొదటి భాగంతో పోలిస్తే రెండో భాగం ప్రేక్షకులను థియేటర్‌కి రప్పించడంలో సక్సెస్ కాలేదు.

ఐశ్వర్యరాయ్(Aishwarya Rai), చియాన్ విక్రమ్(Chiyan Vikram) జంటగా మణిరత్నం(Manirathnam) దర్శకత్వంలో వ‌చ్చిన‌ 'పొన్నియిన్ సెల్వన్-2′(PS-II) చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. అయితే మొదటి భాగంతో పోలిస్తే రెండో భాగం ప్రేక్షకులను థియేటర్‌కి రప్పించడంలో సక్సెస్ కాలేదు. ప్ర‌స్తుతం ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌కు సిద్ధ‌మైంది. ఈ చిత్రం ఓటీటీ ప్లాట్‌ఫారమ్ హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో ద‌క్కించుకుంది. అయితే, థియేటర్ లో మాదిరిగానే.. ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో ఆ చిత్రాన్ని చూడాలంటే మీ జేబులు ఖాళీ చేసుకోవాల్సిందే.

ఎందుకంటే ఈ చిత్రం ప్రైమ్ వీడియోలో అద్దెకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. చియాన్ విక్రమ్, త్రిష కృష్ణన్(Trisha krishnan) నటించిన ఈ చిత్రాన్ని చూడటానికి అభిమానులు 399 రూపాయలు చెల్లించాలి. ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో ఈ చిత్రం ఉచిత ప్రదర్శన ఎప్పుడు ఉంటుంద‌నేది వెల్లడించలేదు. పొన్నియిన్ సెల్వన్ 2 ఏప్రిల్ 28న సినిమా హాళ్లలో విడుదలైంది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 332 కోట్ల రూపాయలను రాబట్టింది. ప్రస్తుతం సినిమా క‌లెక్ష‌న్ల‌ వేగం త‌గ్గింది. ఐశ్వర్యరాయ్, చియాన్ విక్రమ్‌తో పాటు, త్రిష కృష్ణన్, శోభితా ధూళిపాళ వంటి పలువురు తారలు ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలు పోషించారు.

Updated On 26 May 2023 2:54 AM GMT
Ehatv

Ehatv

Next Story