హాట్‌ హీరోయిన్‌ నమిత(Namitha) తెలుగు సినీ అభిమానులకు సుపరిచితమే! లేటెస్ట్‌గా ఆమె భర్త వీరేంద్ర చౌదరికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. బిజినెస్‌మన్‌గా కొనసాగుతున్న వీరేంద్ర చౌదరి దాదాపు 41 లక్షల రూపాయల మోసానికి పాల్పడినట్టు తమిళనాడు సేలం సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు నోటీసులు జారీ చేశారు.

హాట్‌ హీరోయిన్‌ నమిత(Namitha) తెలుగు సినీ అభిమానులకు సుపరిచితమే! లేటెస్ట్‌గా ఆమె భర్త వీరేంద్ర చౌదరికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. బిజినెస్‌మన్‌గా కొనసాగుతున్న వీరేంద్ర చౌదరి దాదాపు 41 లక్షల రూపాయల మోసానికి పాల్పడినట్టు తమిళనాడు సేలం సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు నోటీసులు జారీ చేశారు. 2017లో తిరుపతి ఇస్కాన్‌ టెంపుల్‌లో నమిత- వీరేంద్ర వివాహం జరిగింది. వీరి పెళ్లికి కుటుంబసభ్యులు, స్నేహితులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. 2016లో తిరుచ్చిలో అప్పటి ముఖ్యమంత్రి జయలలితను కలుసుకుని అన్నాడీఎంకేలో చేరారు నమిత. జయలలిత చనిపోయిన తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమై 2019లో బీజేపీలో చేరారు. పార్టీలో చేరిన ఎనిమిది నెలలలోనే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా నియమితులయ్యారు. మొన్న కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం కూడా చేశారు. ఇప్పుడు నమిత వచ్చే ఏడాది లోక్‌సభకు జరిగే ఎన్నికల కోసం తమిళనాడులో జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇదే సమయంలో తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో నమిత భర్త కేసులో చిక్కుకున్నారు. వీరేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి కంపెనీ ( MSME) ప్రమోషన్ కౌన్సిల్, తమిళనాడు అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ సంస్థ జాతీయ అధ్యక్షుడు ముత్తురామన్, కార్యదర్శి దుష్యంత్ యాదవ్‌లు 41 లక్షల రూపాయలు తీసుకుని, కేంద్ర ప్రభుత్వం నుంచి రుణం ఇప్పిస్తానని చెప్పి మోసం చేశారని సేలంకు చెందిన గోపాలస్వామి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ముత్తురామన్, దుష్యంత్ యాదవ్‌లను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఇదే MSME లో తమిళనాడుకు అధ్యక్షుడిగా ఉన్న నమిత భర్తను కూడా విచారించాలని పోలీసులు భావించారు. ఈ మేరకు విచారణకు హాజరుకావాలని నమిత భర్తకు కూడా సమన్లు ​​జారీ చేశారు. అయితే ఇప్పటి వరకు ఆయన కనిపించకపోవడంతో పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతారనే వార్తలు వస్తున్నాయి.

Updated On 15 Nov 2023 6:36 AM GMT
Ehatv

Ehatv

Next Story