టాలీవుడ్‌ హీరో రాజ్‌ తరుణ్‌(Raj tharun)- లావణ్య చౌదరి(Lavanya) కేసులో లేటెస్ట్‌గా ఛార్జ్‌షీట్‌(Charsheet) దాఖలయ్యింది.

టాలీవుడ్‌ హీరో రాజ్‌ తరుణ్‌(Raj tharun)- లావణ్య చౌదరి(Lavanya) కేసులో లేటెస్ట్‌గా ఛార్జ్‌షీట్‌(Charsheet) దాఖలయ్యింది. రాజ్‌తరుణ్‌పై లాణ్య చేసిన ఆరోపణలలో నిజం ఉందని పోలీసులు కనుగొన్నారు. లావణ్య- రాజ్‌తరుణ్‌ పదేళ్లుగా ఒకే ఇంట్లో ఉన్నట్లుగా తమ ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు చెప్పారు. లావణ్య ఇంటి దగ్గర ఇందుకు సంబంధించిన సాక్ష్యాలు సేకరించామన్నారు. ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ రాజ్‌తరుణ్‌పై లావణ్య అనే యువతి నార్సింగి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే! రాజ్‌ తరుణ్‌, తాను పదేళ్లుగా కలిసి జీవించామని, ఇప్పుడు అతను ముంబాయి చెందిన హీరోయిన్‌తో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడంటూ గతంలో ఆమె పిర్యాదులో పేర్కొంది. ఇందుకు సంబంధించి పలు ఆధారాలను పోలీసులకు సమర్పించింది. ఈ క్రమంలో ఆమె రాజ్‌ తరుణపై కేసు కూడా పెట్టింది. ఈ కేసులో రాజ్‌తరుణ్ ముందస్తు బెయిల్ తీసుకున్నాడు. రాజ్‌ తరుణ్‌ విషయంలో తాజాగా పోలీసులు ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయడంతో ఆయన తీసుకున్న ముందస్తు బెయిల్‌ కొట్టివేసే అవకాశం ఉంది.

Eha Tv

Eha Tv

Next Story